పృథ్వీరాజ్‌ వ్యాఖ్యలపై సీఎం ఆగ్రహం

రాజధాని రైతులను ఉద్దేశించి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‌ (ఎస్వీబీసీ) ఛైర్మన్‌ బాలిరెడ్డి పృథ్వీరాజ్‌ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్‌ ఆగ్రహించారు.

Updated : 12 Jan 2020 07:45 IST

 అమరావతి: రాజధాని రైతులను ఉద్దేశించి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‌ (ఎస్వీబీసీ) ఛైర్మన్‌ బాలిరెడ్డి పృథ్వీరాజ్‌ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్‌ ఆగ్రహించారు. సమస్యలపై మాట్లాడాలే తప్ప.. కులాల ప్రస్తావన సరికాదని స్పష్టం చేశారు. రైతులపై ఇష్టానుసారంగా మాట్లాడటాన్ని అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తోందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కులాలను ప్రస్తావిస్తూ.. ఎవరినీ కించపరిచేలా మాట్లాడకూడదని సీఎం ఆదేశించినట్లు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని