విమానం ఎక్కాక వెనక్కి రావాలనుకుని..
పూటుగా మద్యం సేవించిన ప్రయాణికురాలు ఒకరు గాల్లో విమానాన్ని పేల్చివేస్తానని బెదిరించడంతో ఎయిర్ ఏషియా విమానం తిరిగి విమానాశ్రయానికి వచ్చింది. కోల్కతా విమానాశ్రయం నుంచి శనివారం 114 మంది ప్రయాణికులతో విమానం ముంబయి బయలుదేరింది.
తన వద్ద బాంబులు ఉన్నాయని మహిళ హల్చల్
కోల్కతా: పూటుగా మద్యం సేవించిన ప్రయాణికురాలు ఒకరు గాల్లో విమానాన్ని పేల్చివేస్తానని బెదిరించడంతో ఎయిర్ ఏషియా విమానం తిరిగి విమానాశ్రయానికి వచ్చింది. కోల్కతా విమానాశ్రయం నుంచి శనివారం 114 మంది ప్రయాణికులతో విమానం ముంబయి బయలుదేరింది. అనంతరం కొద్దిసేపటికే ఓ ప్రయాణికురాలు వెనక్కి రావాలని భావించింది. విమాన సిబ్బంది ఒకరిని పిలిచి పైలట్కు ఇవ్వాల్సిందిగా చిన్న కాగితాన్ని చేతిలో పెట్టింది. ‘‘నా శరీరం చుట్టూ బాంబులు ఉన్నాయి. ఎప్పుడైనా వాటిని పేల్చేస్తాను’’ అని అందులో ఉంది. అప్రమత్తమైన పైలట్ ఏటీసీని ఆశ్రయించగా.. వెనక్కి రావాల్సిందిగా ఆదేశాలు అందాయి. అనంతరం విమానం కిందకు దిగిన వెంటనే ప్రత్యేక ప్రాంతానికి తీసుకెళ్లి తనిఖీలు నిర్వహించారు. సీఐఎస్ఎఫ్ సిబ్బంది ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకుని పరిశీలించారు. ఎక్కడా బాంబులు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం