టాప్ 10 న్యూస్ - 9 AM
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డిలు సోమవారం హైదరాబాద్ ప్రగతిభవన్లో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం వరకు ఇది సాగే వీలుంది. ఈ సమావేశానికి అధికారులను
1. నేడు ఇద్దరు సీఎంల ఏకాంత భేటీ!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డిలు సోమవారం హైదరాబాద్ ప్రగతిభవన్లో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం వరకు ఇది సాగే వీలుంది. ఈ సమావేశానికి అధికారులను పిలవలేదు. ఇద్దరే ఏకాంతంగా చర్చించుకోనున్నారని సమాచారం. చివరిసారిగా గత సెప్టెంబరు 23న ప్రగతిభవన్లో ఇద్దరు సీఎంల సమావేశం జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. లంచం, అవినీతి కేసుల అభియోగాలుంటే అనర్హులే
లంచం, అవినీతి కేసుల అభియోగాలున్నవారు.. విధుల నుంచి తొలగించిన ఉద్యోగులకు ఐదేళ్ల వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వివిధ నేరాల్లో జైలుశిక్ష అనుభవించిన వారు సైతం శిక్షాకాలం ముగిసిన ఐదేళ్ల తర్వాతే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులవుతారని పేర్కొంది. త్వరలో జరగనున్న మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి నియమ నిబంధనలను సంఘం ఆదివారం విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. కేటీఆర్కు భాజపా భయం
తెలంగాణ పురపాలక, నగరపాలక ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల ఫలితాలను పునరావృతం చేస్తామని.. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లను కమలదళం కైవసం చేసుకుంటుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధీమా వ్యక్తంచేశారు. కేటీఆర్కు భాజపా భయం పట్టుకుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో లక్ష్మణ్ ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు. పూర్తి ఇంటర్వ్యూ కోసం క్లిక్ చేయండి
4. ‘స్థానిక’ తీర్పు రెఫరెండంగా భావిస్తాం
స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్నాయని, వీటి ఫలితాలు రాజధాని మార్పు అంశంపై రెఫరెండంగా భావిస్తామని ఏపీ ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం జిల్లాల పునర్విభజన జరుగుతుందని స్పష్టం చేశారు. 3 రాజధానుల ప్రతిపాదనలపై ప్రతిపక్షాలది రాజకీయ రాద్ధాంతమేనని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. బీటెక్ కొత్తగా
ఇంజినీరింగ్లో వచ్చే విద్యా సంవత్సరం బీటెక్ స్థాయిలో కొత్త కోర్సులు వెల్లువలా రానున్నాయి. ముఖ్యంగా కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్, రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా సైన్సెస్, సైబర్ సెక్యూరిటీ, 3డీ ప్రింటింగ్ అండ్ డిజైన్, వర్చువల్ రియాలిటీ లాంటి కోర్సులను ప్రవేశపెట్టేందుకు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. బ్యాంకుల్లో డిపాజిట్లకు మరింత భద్రత
బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్లో నిల్వ చేసిన డిపాజిట్లకు భద్రత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రిసొల్యూషన్ ఆథారిటీ ఫర్ ఇన్సూరెన్స్ ఫండ్ (ఆర్ఐఏఎఫ్) అనే సంస్థను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా బిల్లు తీసుకురానుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు సాధారణంగా డిపాజిట్దార్లకు పూర్తి మొత్తం కాకుండా కొంత మొత్తాన్నే చెల్లిస్తారు. అయితే దానికన్నా మరికొంత ఎక్కువ మొత్తం ఇచ్చేందుకు వీలుగా ఆర్ఐఏఎఫ్ను ఏర్పాటు చేయనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. వీఐపీలకు బ్లాక్ క్యాట్ రక్షణ బంద్
ఒంటిపై నల్లటి దుస్తులు.. చేతిలో అధునాతన ఆయుధాలు.. పరిసరాలపై డేగ చూపులు.. అత్యంత ప్రముఖుల చుట్టూ దర్శనమిచ్చే ‘బ్లాక్ క్యాట్’ కమాండోలు ఇక జనబాహుళ్యంలో కనిపించరు. వీఐపీల రక్షణ బాధ్యతల నుంచి వీరిని పూర్తిగా ఉపసంహరించాలని కేంద్రం నిర్ణయించింది. ఫలితంగా తెదేపా అధినేత చంద్రబాబు సహా 13 మందికి ‘బ్లాక్ క్యాట్’ భద్రత ఉండదు. ఈ బాధ్యతలను త్వరలో పారామిలటరీ దళాలకు అప్పగిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. రాజ్యాంగంపై ఆత్మపరిశీలన చేసుకుందాం
రాజ్యాంగంపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని వివిధ రంగాలకు చెందిన ఎనిమిది మంది ప్రముఖులు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ ఎస్.వై.ఖురేషి తదితరులు ఈ మేరకు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న అనుకూల, వ్యతిరేక ఆందోళనలు... ఈ నెల 26న జరగనున్న గణతంత్ర దినోత్సవ నేపథ్యంలో వారు ఈ లేఖ విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. త్వరలో ఐఏఎఫ్లోకి 200 యుద్ధవిమానాలు
వైమానిక దళం(ఐఏఎఫ్)లో యుద్ధవిమానాల సంఖ్యను పెంచడానికి చర్యలు చేపట్టనున్నట్లు రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ చెప్పారు. త్వరలో దాదాపు 200 యుద్ధవిమానాలను సమకూర్చుకోనున్నట్లు తెలిపారు. దేశీయంగా 83 తేజస్ మార్క్-1ఏ లోహవిహంగాలను కొనుగోలు చేసేందుకు ఉద్దేశించిన కాంట్రాక్టు తుది దశలో ఉందన్నారు. వీటికి తోడు 110 యుద్ధ విమానాల సరఫరా కోసం ప్రతిపాదనలు కోరనున్నట్లు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. బుమ్రాకు ఉమ్రిగర్ పురస్కారం
బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమంలో టీమ్ ఇండియా ఫాస్ట్బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. 2018-19 సీజన్లో అంతర్జాతీయ క్రికెట్లో విశేషంగా రాణించిన అతడు పాలీ ఉమ్రిగర్, దిలీప్ సర్దేశాయ్ అవార్డులను అందుకున్నాడు. అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెటర్కు ఉమ్రిగర్ పురస్కారంతో పాటు రూ.15 లక్షల చెక్కు ఇస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు