పురపోరులో తెరాస ఏకగ్రీవాల జోరు
పురపాలిక ఎన్నికల్లో ఏకగ్రీవాలతో తెరాస జోరు కొనసాగిస్తోంది. పలు పురపాలికల్లో వార్డులకు ఒకే అభ్యర్థి బరిలో ఉండగా గెలుపు లాంచనమైంది. పలు మున్సిపాలిటీల్లో ఏకగ్రీవాలు సాధించిన తెరాస శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 35 మున్సిపాలిటీల్లోని 84 వార్డులు, ఓ డివిజన్ను..
హైదరాబాద్: పురపాలిక ఎన్నికల్లో ఏకగ్రీవాలతో తెరాస జోరు కొనసాగిస్తోంది. పలు పురపాలికల్లో వార్డులకు ఒకే అభ్యర్థి బరిలో ఉండగా గెలుపు లాంచనమైంది. పలు మున్సిపాలిటీల్లో ఏకగ్రీవాలు సాధించిన తెరాస శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 35 మున్సిపాలిటీల్లోని 84 వార్డులు, ఓ డివిజన్ను తెరాస ఏకగ్రీవంగా కైవసం చేసుకుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గట్టు రామచంద్రరావు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 700 వార్డుల్లో భాజపాకు, 400 వార్డుల్లో కాంగ్రెస్కు అభ్యర్థులు లేరని పేర్కొన్నారు. తెలంగాణలో ఈ రెండు పార్టీలకు సరైన కేడర్ లేదని.. ముసుగు పొత్తులో పరస్పరం సహకరించుకునే పనిలో ఉన్నాయంటూ రామచంద్రరావు ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఫలితాలే పునరావృతం అవుతాయని.. ఈనెల 22న జరిగే ఎన్నికల్లో తెరాస ఏకపక్ష విజయం సాధిస్తుందన్నారు.
చెన్నూరు మున్సిపాలిటీల్లో 18 వార్డులకు గాను 7 వార్డుల్లో తెరాస వశమయ్యాయి. నిర్మల్ పురపాలికలో ఇద్దరు తెరాస అభ్యర్థులు ఏకగ్రీవం కాగా అభ్యర్థి ఈశ్వర్ను మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించారు. కోరుట్ల పురపాలికలోని 3 వార్డుల్లో తెరాస అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనూ తెరాస అభ్యర్థులు ఏకగ్రీవాలు సాధించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పురపాలికలోని 23 వార్డులకుగాను 6 వార్డులు, చెన్నూరులో 18 వార్డులకు గాను 7 వార్డుల్లో తెరాస ఏకగ్రీవం సాధించింది. మేడ్చల్ జిల్లా పోచారం పురపాలికలో ఇద్దరు, సిరిసిల్లలో 4, వరంగల్ గ్రామీణం జిల్లా పరకాల పురపాలికలో 11 వార్డుల్లో తెరాస అభ్యర్థులు ఏకగ్రీవం సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్