ప్రత్యర్థులుగా తల్లీకూతుళ్లు

సాధారణంగా ఎన్నికల్లో ఎవరైనా నిలబడితే కుటుంబ సభ్యులు ఒక్కటిగా నిలిచి గెలుపే ధ్యేయంగా ప్రచారం చేస్తారు. కానీ రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పురపాలక సంఘం

Updated : 15 Jan 2020 08:54 IST

సాధారణంగా ఎన్నికల్లో ఎవరైనా నిలబడితే కుటుంబ సభ్యులు ఒక్కటిగా నిలిచి గెలుపే ధ్యేయంగా ప్రచారం చేస్తారు. కానీ రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పురపాలక సంఘం ఎన్నికల్లో తల్లీ, కుమార్తె ప్రత్యర్థులుగా పోటీకి దిగారు. పులికంటి నాగమ్మ(కాంగ్రెస్‌), ఆమె కుమార్తె పులికంటి అలివేలు(తెరాస)లు 5వ వార్డు నుంచి బరిలో దిగారు. ఆమనగల్లు పట్టణానికి చెందిన పులికంటి నాగమ్మ కుమార్తె అలివేలు అదే పట్టణానికి చెందిన యువకుడిని ప్రేమ వివాహం చేసుకొని అక్కడే నివాసం ఉంటున్నారు. దీంతో ఈ వార్డులో ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.

- న్యూస్‌టుడే, ఆమనగల్లు
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని