కోడిపందేల్లో సందడి చేసిన జబర్దస్త్‌ నటులు

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్‌షోకు చెందిన నటులు కోడిపందేలలో సందడి చేశారు...

Published : 16 Jan 2020 05:25 IST

నరసాపురం: ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్‌షోకు చెందిన నటులు కోడిపందేలలో సందడి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో  ఆటో రాంప్రసాద్‌, రైజింగ్‌ రాజు, దొరబాబు పాల్గొన్నారు. అక్కడ జరిగిన కోడిపందేలను వీక్షించారు. పందేలు చూడాలన్న కోరిక ఇన్ని రోజులకు తీరిందని రాంప్రసాద్‌ అన్నారు. అంతేకాకుండా నేను రెండు కోళ్లను తీసుకొచ్చాను. ఒకటి మన రాజు అయితే, ఇంకోటి మన దొరబాబు. వీరిద్దరికీ ఇప్పుడు పందెం పెడదామని సరదాగా మీడియాతో మాట్లాడారు. ‘కోడిపందేలు తమకు కొత్తేమి కాదు. మేము గోదావరి జిల్లావాసులమే, సరదాగా చూసి వెళ్దామని ఇక్కడకు వచ్చామని’ దొరబాబు, రాజు అన్నారు. అలాగే తెలుగు రాష్ట్ర ప్రజలందరీకీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

 

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని