టాప్ 10 న్యూస్ - 9 AM
పాడి పశువుల పండగ కనుమ. వ్యవసాయ క్షేత్రాల్లో పంటల సాగుకు ఎంతో సహాయపడిన పశువులకు రైతులు కృతజ్ఞత తెలుపుకొనే రోజు కనుమ. రైతులు తమకు పండిన పంటను తామే కాకుండా పశుపక్ష్యాదులతో పంచుకోవాలని పిట్టల కోసం
1. కనుమ ప్రాశస్త్యం ఏమిటి?
పాడి పశువుల పండగ కనుమ. వ్యవసాయ క్షేత్రాల్లో పంటల సాగుకు ఎంతో సహాయపడిన పశువులకు రైతులు కృతజ్ఞత తెలుపుకొనే రోజు కనుమ. రైతులు తమకు పండిన పంటను తామే కాకుండా పశుపక్ష్యాదులతో పంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులను ఇంటి గుమ్మాలకు కడతారు. అయితే, ‘కనుమ రోజున కాకులు కూడా కదలవు’ అనే సామెతను గుర్తు చేస్తూ ఆ రోజు ప్రయాణాలు చేయొద్దని మన పూర్వీకులు చెబుతుంటారు. తరతరాలుగా అనుసరిస్తున్న ఈ సంప్రదాయ నియమాల వ్యాప్తి వెనుక ఉద్దేశాలను పరిశీలిస్తే.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. పట్టాలు తప్పిన ఎల్టీటీ ఎక్స్ప్రెస్
ఒడిశాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఉదయం కటక్ సమీపంలో ఎల్టీటీ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ముంబయి నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ఎల్టీటీ ఎక్స్ప్రెస్ 6 బోగీలు నిర్గుండి వద్ద పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 50 మందికిపైగా గాయపడగా.. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను కటక్లోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
3. అమరావతిలో పోలీసుల దిద్దుబాటు చర్యలు
ఏపీ రాజధాని కోసం ఉద్యమిస్తున్న రైతులు, మహిళలపై పోలీసులు వ్యవహరించిన తీరును హైకోర్టు తీవ్రంగా పరిగణించడం, 144 సెక్షన్ విధించడాన్ని ఆక్షేపించిన నేపథ్యంలో పోలీసులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. బుధవారం రాత్రి కొందరు పోలీసు అధికారులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసులు తమను 144 సెక్షన్ పేరుతో ఇబ్బంది పెట్టలేదని, ఎలాంటి ఆంక్షలు విధించడంలేదని కాగితాలపై రాసుకొచ్చి.. సంతకాలు చేయాలని రైతులపై ఒత్తిడి తెచ్చారు. పోలీసుల సూచనను రైతులు తోసిపుచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. భాజపా, జనసేన కీలక భేటీ నేడు
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారతీయ జనతాపార్టీ, జనసేన పార్టీలు కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యాయి. రెండు పార్టీల ముఖ్యనేతలు ఇవాళ విజయవాడలో సమావేశమై ఉమ్మడి కార్యాచరణ ప్రకటించనున్నారు. అమరావతిలో రాజధాని కొనసాగింపు అంశమే తొలి పోరాట అజెండా కానుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. 1770.. పోలింగ్ కేంద్రాలు
తెలంగాణ పురపాలిక ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తయింది. ఈమేరకు ఎన్నికల సంఘం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు జిల్లాలో 1770 పోలింగ్ కేంద్రాలు ఎన్నికల కోసం గుర్తించారు. రంగారెడ్డి జిల్లాల్లో మూడు కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలు ఉండగా 938 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. పరేడ్ గ్రౌండ్స్లో కైట్స్ ఫెస్టివల్
7. కోడి పందాల జోరు
8. పొడవాటి జుట్టుతో గిన్నీస్ రికార్డు
కేశాలంకరణ ఆమెకు అందంతో పాటు అవార్డును కూడా తెచ్చిపెట్టింది. గుజరాత్ రాష్ట్రంలోని అరవల్లికి చెందిన నీలాన్షి పటేల్ అనే 17 ఏళ్ల యువతి పొడవైన జుట్టుతో టీనేజి విభాగంలో గిన్నీస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. అత్యంత పొడవైన జుట్టు ఉన్న టీనేజి యువతిగా ఆమెకు గిన్నీస్ బుక్లో స్థానం కల్పించారు. 2018లో 170.5 సెంటీ మీటర్ల పొడవాటి జుట్టుతో గతంలో ఓ టీనేజి యువతి పేరిట ఉన్న రికార్డును ... నీలాన్షి 190 సెంటీమీటర్ల పొడవైన జుట్టుతో బద్దలు కొట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. రష్యా కొత్త ప్రధానిగా మిషుస్తిన్?
రష్యా ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రాజ్యాంగ సంస్కరణలను ప్రతిపాదించిన నేపథ్యంలో రష్యా ప్రధాని దిమిత్రి మెద్వదేవ్ రాజీనామా చేశారు. ఈమేరకు తన రాజీనామా లేఖను అధ్యక్షుడు పుతిన్కు సమర్పించారు. మంత్రివర్గం, రాజ్యాంగంలో సంస్కరణలపై భేటీ తర్వాతే మెద్వదేవ్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. రష్యా కొత్త ప్రధానిగా మిషుస్తిన్ పేరును పుతిన్ ప్రతిపాదించారు. ప్రస్తుతం మిషుస్తిన్ ఫెడరల్ ట్యాక్స్ సర్వీసెస్ అధినేతగా ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. యువకుడి స్టెప్పులకు ఫిదా అయిన హృతిక్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి