రాజధానిలో 144 సెక్షన్‌పై హైకోర్టు విచారణ

అమరావతి రాజధాని గ్రామాల్లో సెక్షన్‌ 144, పోలీస్‌ యాక్టు 30 అమలుపై హైకోర్టు విచారణ చేపట్టింది. రాజధాని గ్రామాలు, విజయవాడలో నిషేధాజ్ఞలు అమలుపై మొత్తం ఏడు పిటిషన్లు దాఖలయ్యాయి.

Updated : 17 Jan 2020 12:11 IST

అమరావతి: అమరావతి రాజధాని గ్రామాల్లో సెక్షన్‌ 144, పోలీస్‌ యాక్టు 30 అమలుపై హైకోర్టు విచారణ చేపట్టింది. రాజధాని గ్రామాలు, విజయవాడలో నిషేధాజ్ఞలు అమలుపై మొత్తం ఏడు పిటిషన్లు దాఖలయ్యాయి. రాజధాని మహిళలు, రైతులు,  న్యాయవాదులు దాఖలు చేసిన ఈ పిటిషన్లతో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జీకే మహేశ్వరి ఈ వ్యవహారాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించారు. అన్ని పిటిషన్లను కలిపి న్యాయస్థానం విచారణ చేస్తోంది. మరోవైపు, రాజధానిలో ఆందోళనలు 31వ రోజూ కొనసాగుతున్నాయి. తాము ఆందోళన ప్రారంభించినప్పటి నుంచి పోలీసులు తమ పట్ల అనుసరిస్తున్న వైఖరి అభ్యంతరకరంగా ఉందని.. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని రైతులు కోర్టుకు తెలిపారు.  శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్న తమపై పోలీసులు దాడి చేస్తున్నారంటూ పేర్కొన్నారు. దీనివల్ల రాజధాని ప్రాంతంలో నిరసనలు తెలియజేసే అవకాశం లేకుండా పోయిందని, తమపై నిర్బంధ కాండ కొనసాగుతోందని వాపోయారు. సెక్షన్‌ 144, పోలీస్‌ యాక్ట్‌ 30ని ఉపసంహరించుకొనేలా తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. పోలీసులు, రైతుల తరఫున వాదనలను న్యాయమూర్తులు వింటున్నారు. కాసేపట్లో దీనిపై తీర్పు వెలువడనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని