సీఎం జగన్కు హైపవర్ కమిటీ ప్రజెంటేషన్!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో హైపవర్ కమిటీ సమావేశం ముగిసింది. తాడేపల్లిలోని సీఎం నివాసంలో ఈ భేటీ జరిగింది. పాలన వికేంద్రీకరణ, రాజధాని అంశంపై ...
ముఖ్యమంత్రితో ముగిసిన కీలక భేటీ
రేపు మరోమారు భేటీ కానున్న హైపవర్ కమిటీ
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో హైపవర్ కమిటీ సమావేశం ముగిసింది. తాడేపల్లిలోని సీఎం నివాసంలో ఈ భేటీ జరిగింది. పాలన వికేంద్రీకరణ, రాజధాని అంశంపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ సభ్యులు సీఎంతో పలు కీలక అంశాలపై చర్చించారు. జీఎన్రావు, బీసీజీ నివేదికలపై చర్చించేందుకు గతంలో మూడు సార్లు భేటీ అయిన ఈ కమిటీ వేర్వేరు ప్రతిపాదనలను రూపొందించింది. వీటిని ప్రజెంటేషన్ రూపంలో కమిటీ సభ్యులు సీఎంకు వివరించినట్టు సమాచారం. ఈ ఉదయం 11గంటల సమయంలో ప్రారంభమైన ఈ భేటీలో 10 మంది మంత్రులతో పాటు అధికారులు కూడా పాల్గొని చర్చించారు. రేపు మరోసారి హైపవర్ కమిటీ భేటీ కానుంది. అంతర్గతంగా సమావేశమై తుది నివేదికను కమిటీ రూపొందించనుంది. రెండ్రోజుల్లో ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక అందజేయనుంది.
ప్రధానంగా గడిచిన మూడు సమావేశాల్లో చర్చించిన అంశాలతో పాటు తమ అధ్యయనంలో వచ్చిన అంశాలను సీఎంకు వివరించినట్టు సమాచారం. మంత్రులు బుగ్గన, బొత్స తదితరులు ఇప్పటివరకు వచ్చిన ప్రతిపాదనలు, రైతుల నుంచి వచ్చిన అభ్యర్థనలను సీఎంకు వివరించినట్టు తెలుస్తోంది.హైపవర్ కమిటీ తొలి సమావేశంలో బీసీజీ, జీఎన్రావు కమిటీ ఇచ్చిన నివేదికల్లో పేర్కొన్న అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేసింది. జీఎన్రావు కమిటీ ఇచ్చిన నివేదికను స్వయంగా ఆయనే హైపవర్ కమిటీకి వివరించారు. మూడు రాజధానుల ప్రతిపాదనలతో పాటు నాలుగు కమిషనరేట్లు ఉండాలనే అంశాన్ని ఆయన కమిటీకి వివరించారు. రెండో దఫా సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగుల తరలింపుపై వచ్చిన ప్రతిపాదనలపై కీలకంగా చర్చించింది. వారికి కల్పించాల్సిన సౌకర్యాలు, మౌలిక వసతులను చర్చించారు. మూడో సమావేశంలో పాలన వికేంద్రీకరణతో పాటు అమరావతి రాజధాని ప్రాంతం రైతులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలను చర్చించారు. ఈ మూడు భేటీల్లో జరిగిన చర్చలు, తమ అధ్యయన నివేదికలను ప్రజెంటేషన్ రూపంలో సీఎంకు వివరించింది. ఈ నెల 20న హైపవర్ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. 20న మంత్రివర్గ సమావేశంతో పాటు అదే రోజు అసెంబ్లీ కూడా భేటీ కానుంది. ఈ శాసనసభ సమావేశాలు మూడు రోజుల పాటు జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశాల్లోనే రాజధాని అంశంపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
నగర శివారులో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి శ్రీశైలం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు