40కి.మీ. దాటితే బాదుడే
హైదరాబాద్ నగరవ్యాప్తంగా అన్ని పైవంతెనలపై వేగ పరిమితి నిబంధన అమల్లోకి రాబోతుంది. జీహెచ్ఎంసీ ప్రాజెక్టుల విభాగం దీనిపై కసరత్తు చేసి సూచిక బోర్డులు, నియంత్రికల ఏర్పాటు పనులు ప్రారంభించింది. సైబరాబాద్ పోలీసుల సూచనతో ప్రస్తుతం ఐటీ కారిడార్లో
అన్ని పై వంతెనలపై వేగపరిమితి నిబంధన
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ నగరవ్యాప్తంగా అన్ని పైవంతెనలపై వేగ పరిమితి నిబంధన అమల్లోకి రాబోతుంది. జీహెచ్ఎంసీ ప్రాజెక్టుల విభాగం దీనిపై కసరత్తు చేసి సూచిక బోర్డులు, నియంత్రికల ఏర్పాటు పనులు ప్రారంభించింది. సైబరాబాద్ పోలీసుల సూచనతో ప్రస్తుతం ఐటీ కారిడార్లో ప్రక్రియ మొదలైందని, నగరమంతా విస్తరిస్తుందని ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు. వాహనదారులు గంటకు 40 కి.మీలకు మించి వేగాన్ని పుంజుకుంటే జరిమానా పడుతుందన్నారు. గతయేడాది చివర్లో బయోడైవర్సిటీ కూడలి పైవంతెనపై రెండు భారీ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం, తాజాగా రాజీవ్గాంధీ కూడలి వంతెనపై ఆగి ఉన్న బైకును వేగంగా ఓ కారు ఢీకొట్టిన దుర్ఘటనలతో యంత్రాంగం అప్రమత్తమైంది.
ప్రయోగాత్మకంగా..
నగరంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్సార్డీపీ) కింద వివిధ మార్గాలు, కూడళ్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే రూ.700 కోట్ల విలువైన పనులు అందుబాటులోకి వచ్చాయి. మరో రూ.3 వేల కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. పూర్తయినవాటిలో అయ్యప్ప సొసైటీ కూడలి అండర్పాస్, మైండ్స్పేస్ కూడలి అండర్పాస్, కేపీహెచ్బీలోని రాజీవ్గాంధీ కూడలి పైవంతెన, ఎల్బీనగర్ కూడలి ఎడమవైపు పైవంతెన, బైరామల్గూడ చెక్పోస్టు కూడలి అండర్పాస్, కామినేని కూడలి ఎడమవైపు పైవంతెన ఉన్నాయి. వీటిలో బయోడైవర్సిటీ రెండోస్థాయి పైవంతెన గతయేడాది నవంబర్ 4న ప్రారంభం కాగా అదే నెల 9, 23 తేదీల్లో రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. సర్కారు ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ మార్గదర్శకాల ప్రకారం మొత్తం పదిచోట్ల వేర్వేరు రకాల రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటయ్యాయి. మలుపుల వద్ద ప్రహరీపై అదనంగా 1.5 మీటర్ల ఎత్తున్న రెయిలింగ్ నిర్మించారు. రోడ్డు మీద థర్మో ప్లాస్టిక్తో గరిష్ఠంగా 40కి.మీ వేగంతో వెళ్లాలంటూ అక్షరాలు రాయించారు. 7 నిఘానేత్రాలు ఉన్నాయి. ఈనెల 4న ఈ వంతెనను తిరిగి ప్రారంభించారు. నెలరోజులు వాహనాల కదలికలను గమనించి తదుపరి నిర్ణయం తీసుకోవాలనేది కమిటీ ఆలోచన.
నిబంధనలకు విరుద్ధమంటూ..
బయోడైవర్సిటీ పైవంతెనపై మలుపునకు ముందు ఏర్పాటు చేసిన రబ్బర్ రంబుల్ స్ట్రిప్స్పై ద్విచక్రవాహనదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బండ్లు ఆగిపోతున్నాయని, నడుము నొప్పి వస్తుందని.. ఐఆర్సీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ పరికరాలను తొలగించాలని కోరుతున్నారు. అయితే కెమెరాల సంఖ్య పెంచి, వేగ పరిమితి దాటిన ప్రతి వాహనానికి జరిమానా విధిస్తుండటంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని..కార్లు నిదానంగా సాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. రాజీవ్గాంధీ కూడలి, మైండ్స్పేస్ కూడలి పైవంతెనల పైనా థర్మోప్లాస్టిక్ రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయాలన్న ట్రాఫిక్ పోలీసుల సూచన విషయాన్ని కమిషనర్ లోకేష్కుమార్కు తెలిపినట్లు ఇంజినీరింగ్ విభాగం తెలిపింది. ఇక మీదట కొత్తగా నిర్మించే ప్రతి పైవంతెనపై వేగ పరిమితి సూచిక బోర్డులు, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చామని, కమిషనర్ అనుమతి తీసుకుని పనులు చేపట్టామని ఓ ఉన్నతాధికారి ‘ఈనాడు’కు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. -
ఆన్లైన్లోనూ నామినేషన్ వేయొచ్చు: వికాస్ రాజ్
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
-
రుణం కోసం ‘చావు తెలివి’.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్