ఏపీ అసెంబ్లీలో ‘జై అమరావతి’ నినాదాలు

ఏపీ అసెంబ్లీలో మాటల యుద్ధం కొనసాగుతోంది. మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే తెదేపా సభ్యులు ‘జై  అమరావతి, ప్రతి శుక్రవారం కోర్టుకు

Updated : 22 Jan 2020 11:18 IST

అమరావతి: ఏపీ అసెంబ్లీలో మాటల యుద్ధం కొనసాగుతోంది. మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే తెదేపా సభ్యులు ‘జై  అమరావతి, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాలి’ అంటూ నినాదాలు చేశారు. స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. తెదేపా సభ్యులు ఆందోళన చేస్తుండగానే ..మంత్రులు తమ ప్రసంగం కొనసాగించారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ... అమ్మ ఒడి, రైతు భరోసా లాంటి కీలక అంశాలపై సభలో చర్చ జరుగుతున్నప్పుడు తెదేపా సభ్యులు గందరగోళం  చేయడం తగదన్నారు. విశాఖకు రాజధాని వస్తుంటే ఉత్తరాంధ్ర తెదేపా ఎమ్మెల్యేలు అడ్డుకోవడం దారుణమని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని