కీటో డైట్...నిజంగా మంచిదేనా?
కీటో డైట్కు మారుదామనుకుంటున్నారా? మరి దానిని గురించిన వివరాలు మీకు తెలుసా?
కీటో డైట్ గురించి వివరాలు మీకు తెలుసా?
వాషింగ్టన్: బరువు తగ్గాలనుకుంటున్నారా? కీటో డైట్కు మారుదామనుకుంటున్నారా?బరువు తగ్గడానికి కీటోజెనిక్ లేదా కీటో డైట్ అత్యుత్తమం అని భావించేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే అదేమంత మంచిది కాదని మరికొందరు కొట్టి పారేస్తారు. మరి కీటో డైట్ ఆహార విధానాన్ని గురించి వివరాల్లోకి వెళితే...
అసలు కీటో డైట్ అంటే ఏమిటి?
ఆహారంలో అతి తక్కువ కార్బోహైడ్రేట్స్, అధికంగా ప్రోటీన్లు, కొద్దిగా కొవ్వు పదార్ధాలు తీసుకోవటమే కీటో డైట్ విధానం. కీటో ఆహార పద్ధతిలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా లభించటంతో శరీరం తనకు అవసరమైన శక్తిని కొవ్వు నుంచి తీసుకుంటుంది. దీనిని పాటించినపుడు శరీరానికి అవసరమయ్యే రోజువారీ కెలోరీ విలువలో 70 నుంచి 80 శాతం కొవ్వు పదార్ధాల నుంచి, 20 శాతం ప్రోటీన్ల నుంచి మిగిలిన 5 శాతం కార్బోహైడ్రేట్ల నుంచి లభిస్తాయి. కీటో డైట్ విధానాన్ని మొదట్లో చిన్నపిల్లల్లో వచ్చే మూర్ఛ వ్యాధి చికిత్సలో వాడేవారు. ఆధునిక కాలంలో 1994లో అమెరికాలో మళ్లీ ప్రాచుర్యం ప్రాధాన్యం పొండిన కీటో డైట్, 2007 కల్లా 45 దేశాల్లో విస్తరించింది.
కీటో డైట్ తీసుకుంటే ఏం జరుగుతుంది?
ఈ విధానంలో బరువు అతిత్వరగా తగ్గే మాట నిజమే అయినప్పటికీ, వైద్య రంగం దీనివైపు అంత మొగ్గు చూపటంలేదు. కీటో ఆహార విధానం పాటించినప్పుడు శరీరానికి అత్యవసరమైన అనేక పోషకాలను తీసుకునే అవకాశం ఉండదు. కార్బోహైడ్రేట్లను తీసుకోవటం మానేయటం వలన కొన్ని రకాల విటమిన్లు, పోలీఫెనాల్స్, పీచుపదార్ధాలు శరీరానికి లభించవు. గుండె పనితీరుకు, ఆరోగ్యానికి ఆ పోషకాలు అతి ముఖ్యమైనవని శాస్త్రజ్ఞులు నొక్కి చెపుతున్నారు. పైగా కార్బోహైడ్రేట్లను తినకపోవటం వలన కొవ్వు మాత్రమే కాకుండా కండరాలు కూడా కరిగిపోతాయి. ఇది అభిలషణీయం కాదు.
ఏం చేయాలి?
కీటో డైట్ పాటించే ముందు తమ ఆహార అలవాట్లలో ఈ విధంగా భారీ మార్పులు చేసుకోవటం అవసరమా అనే విషయం, దానిని అమలు చేయాలనుకునేవారు ఆలోచించుకోవాలి. కీటో వంటి ఆహార విధానాల వల్ల తగ్గిన బరువు, అది మానేసిన తరువాత మళ్లీ అంతే త్వరగా పెరగటానికి చాలా అవకాశాలున్నాయి. ఆహారంలో పిండి పదార్ధాలను తక్కువ చేస్తూనే కూరగాయలు, ఆకుకూరలు, పళ్లు, గింజలు వంటి వాటి శాతాన్ని పెంచటం ద్వారా బరువు తగ్గటం ఉత్తమం.
స్థిరంగా బరువు తగ్గటం అనేది మనం తీసుకునే ఆహార నాణ్యత మీద తప్ప, తీసుకున్న కాలరీల మీద ఆధారపడి ఉండదని ఆహార నిపుణులు తేల్చిచెప్పారు. బరువు తగ్గటానికి, ఆరోగ్యంగా ఉండటానికి మధ్య తేడాను గుర్తించాలని డైటీషియన్లు అంటున్నారు. బరువు తగ్గటానికి తాము ఎవరికీ కీటో డైట్ పాటించాలంటూ సలహా ఇవ్వబోమని అమెరికాలోని మౌంట్ సినాయి హెల్త్ సెంటర్కు చెందిన శాస్త్రవేత్తలు చెప్పారు. అరోగ్యంగా ఉండటానికీ, బరువు తగ్గటానికీ ...మంచి ఆహారం తీసుకోవటం, వ్యాయామం చేయటమే ఉత్తమమని వారు మరోసారి తేల్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్గా పీహెచ్డీ రామక్రిష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..