‘తెలంగాణ ముఖ్యమంత్రి.. గుర్తుపెట్టుకోండి’
తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ను సోమవారం ఉదయం దిల్లీకి పంపించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఆందోళనలో పాల్గొనేందుకు
భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ విమర్శలు
దిల్లీకి పంపించిన హైదరాబాద్ పోలీసులు
హైదరాబాద్: తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ను సోమవారం ఉదయం దిల్లీకి పంపించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఆందోళనలో పాల్గొనేందుకు ఆదివారం హైదరాబాద్కు వచ్చిన ఆజాద్ను ఇక్కడి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఉదయం 6.55 గంటలకు ఆయనను దిల్లీ విమానం ఎక్కించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు, తెలంగాణ ప్రభుత్వంపై ఆజాద్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘తెలంగాణలో నియంతృత్వ పాలన తారాస్థాయికి చేరుకుంది. ప్రజల నిరసన హక్కులను కొల్లగొడుతున్నారు. ముందు మా మద్దతుదారులపై దాడి చేశారు. తర్వాత నన్ను కూడా అరెస్టు చేశారు. ఇప్పుడు బలవంతంగా హైదరాబాద్ ఎయిర్పోర్టుకు తీసుకొచ్చి దిల్లీ పంపిస్తున్నారు’ అని ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు. తెలంగాణ సీఎంవో ట్విటర్ ఖాతాను ట్యాగ్ చేస్తూ.. ‘గుర్తుపెట్టుకోండి.. ఈ అవమానాన్ని బహుజన్ సమాజ్ ఎప్పటికీ మర్చిపోదు. త్వరలోనే నేను తిరిగొస్తా’ అని ట్వీట్ చేశారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్లో ఏర్పాటు చేసిన ఆందోళనలో పాల్గొనేందుకు ఆజాద్ నిన్న ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చారు. సాయంత్రం టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో మరో సభలో పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ సభకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో నిర్వాహకులు వాగ్వాదానికి దిగారు. సభలో పాల్గొనేందుకు వచ్చిన వారు కూడా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆజాద్ సభా ప్రాంగణానికి వస్తే మరింత ఉద్రిక్తతలు తప్పవని భావించిన పోలీసులు ఆయనను ముందస్తుగా అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్