ఆంగ్లమాధ్యమంపై హైకోర్టులో విచారణ

ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం స్థానంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రీనివాస్ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.

Updated : 27 Jan 2020 22:11 IST

అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం స్థానంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రీనివాస్ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేసే విషయంలో ముందుకు వెళుతోందని, దీనివల్ల నిధులు దుర్వినియోగం అవుతాయని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై ముందుకు వెళ్తే సంబంధిత అధికారులే బాధ్యత వహిస్తారని న్యాయస్థానం తెలిపింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 4కు హైకోర్టు వాయిదా వేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని