అనుమతి కోరితే.. చెప్పుతో కొట్టిన అధికారిణి

ఇంటి నిర్మాణ అనుమతి కోసం లంచం అడగటమే కాకుండా యజమానిపై చెప్పుతో దాడి చేసింది ఓ మహిళా అధికారి..

Published : 29 Jan 2020 15:34 IST

పికెట్(కంటోన్మెంట్)‌: ఇంటి నిర్మాణ అనుమతి కోసం లంచం అడగటమే కాకుండా ఓ మహిళా అధికారిణి యజమానిపై చెప్పుతో దాడి చేసింది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌కు చెందిన దశరథరామిరెడ్డి గత మూడేళ్లుగా ఇంటి నిర్మాణ అనుమతి కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. కాని వారు అనుమతి ఇవ్వకుండా లంచం అడుగుతూ వేధింపులకు గురి చేస్తున్నారని అతడు ఆరోపిస్తున్నాడు. కోర్టుకు వెళ్లి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ స్పందన లేకపోవడంతో ఇంటి నిర్మాణం ప్రారంభించాడు. మంగళవారం కంటోన్మెంట్‌ అధికారులు నిర్మాణ పనులను పరిశీలించేందుకు వచ్చారు. ఈ క్రమంలో దశరథరామిరెడ్డి మరోసారి నిర్మాణ అనుమతులు కోరగా మహిళా అధికారి ఆగ్రహంతో అతడిపై చెప్పులతో దాడికి పాల్పడింది. అతను ఇచ్చిన ఫిర్యాదు తీసుకోకుండా పోలీసులు తిరిగి అతనిపైనే కేసు నమోదు చేశారని బాధితుడు వాపోయాడు. దాడి చేసిన అధికారిణిపై చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని అతడు డిమాండ్‌ చేశాడు.

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని