టాప్ 10 న్యూస్ - 9 AM
రాష్ట్ర్ర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికలను వెంటనే నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం అధికారులను ఆదేశించారు. పీఏసీఎస్లకు నియమించిన పర్సన్ ఇన్ఛార్జుల పదవీకాలం
1. త్వరలో సహకార ఎన్నికలు
రాష్ట్ర్ర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికలను వెంటనే నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం అధికారులను ఆదేశించారు. పీఏసీఎస్లకు నియమించిన పర్సన్ ఇన్ఛార్జుల పదవీకాలం ముగుస్తున్నందున మూడు, నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని, 15 రోజుల్లోగా ప్రక్రియను ముగించి, కొత్త పాలకమండళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. మీ ప్రాంతానికి మీరే కేసీఆర్
‘మీ మీ వార్డులు, డివిజన్లలో మీరే కేసీఆర్లు. ప్రజలతో మమేకం కావాలి. వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలి. ప్రభుత్వం మీ వెంటే ఉంటుంది’ అని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, పురపాలక మంత్రి కేటీ రామారావు కొత్త మేయర్లు, ఛైర్పర్సన్లకు సూచించారు. తెరాసకు, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన వారిలో దాదాపు వేయిమంది బుధవారం తెలంగాణభవన్కు వచ్చారు. ఈ సందర్భంగా వారితో కేటీఆర్ మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. సీబీఐ దర్యాప్తు కోరడానికి బలమైన కారణాలివే..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వివేకా కుమార్తె డాక్టర్ ఎన్.సునీత, అల్లుడు ఎన్.రాజశేఖర్రెడ్డి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాము సీబీఐ దర్యాప్తు కోరడానికి బలమైన పరిస్థితులు/కారణాల్ని వారు వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఆ వివరాల కోసం క్లిక్ చేయండి
4. పెరగనున్న పెట్రోలు, డీజిలు ధరలు
ఏపీ ప్రభుత్వం పెట్రోలు, డీజిలుపై పన్ను రేటు సవరణ పేరుతో వినియోగదారులపై అదనపు భారం మోపింది. ప్రస్తుతం పెట్రోలు మూల ధరపై లీటరుకు 31 శాతం పన్ను, దానికి రూ.2 స్థిర ధర కలిపి వసూలు చేస్తున్నారు. డీజిలు మూల ధరపై లీటరుకు 22.25 శాతం పన్ను, రూ.2 స్థిర ధర కలిపి వసూలు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం.. స్థిర ధర రూ.2ను తొలగించింది. పన్ను శాతాన్ని పెట్రోలుపై 31 నుంచి 35.20 శాతానికి, డీజిలుపై 22.25 నుంచి 27 శాతానికి పెంచుతూ బుధవారం ఉత్తర్వులిచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ఉరిపై ఉత్కంఠ
నిర్భయ కేసులో దోషులకు వచ్చే నెల 1న ఉరి శిక్ష అమలవుతుందా? కాదా? దేశవ్యాప్తంగా ఈ అంశంపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ కేసుకు సంబంధించి బుధవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరణ శిక్ష ఖరారైన నలుగురు దోషుల్లో ఒకరైన వినయ్ కుమార్ శర్మ రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరాడు. మరో దోషి అక్షయ్ కుమార్ సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. దానిపై గురువారం విచారణ జరగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. మసీదుల్లో మహిళలకూ ప్రవేశం
పురుషుల్లాగే ముస్లిం మహిళలూ మసీదుల్లోకి ప్రవేశించి, నమాజ్ చేసుకోవచ్చని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) సుప్రీంకోర్టుకు తెలియజేసింది. మత సిద్ధాంతాలు, విశ్వాసాలను అనుసరించి మసీదుల్లోకి ప్రవేశించే అనుమతి మహిళలకు ఉందని, ఈ హక్కును వినియోగించుకోవడం పూర్తిగా వారి ఇష్టమని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. యువ శాస్త్రవేత్తలకు ఇస్రో అవకాశం
ఉన్నత పాఠశాలల విద్యార్థులకు యువ శాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశం కల్పిస్తోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో). ఇందులో భాగంగానే ఈ ఏడాది మేలో నిర్వహించనున్న ‘యువికా- యువ విజ్ఞాని’ కార్యక్రమం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన విద్యార్థులకు అన్ని ఖర్చులతోపాటు, సామగ్రి, ఇతర వసతులను సమకూరుస్తుంది. దేశంలోని అహ్మదాబాద్, బెంగళూరు, షిల్లాంగ్, తిరువనంతపురం కేంద్రాల్లో మే 11 నుంచి 22వ తేదీ వరకు రెండు వారాల శిక్షణ ఇస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. పెట్టెలో.. మీ కార్డులు, చెక్కులు
క్రెడిట్ కార్డు, చెక్ బుక్ వచ్చిందంటూ మీ ఇంటి వద్ద ఉన్నామంటూ కొరియర్, పోస్టల్ వ్యక్తి ఫోను చేయడం, మనం ఇంట్లో లేమని చెబితే తిరిగి ఆ వ్యక్తి పట్టుకెళ్లడం చాలా మందికి ఎదురయ్యే అనుభవమే. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని ఓ కొత్త సౌలభ్యాన్ని ఐసీఐసీఐ బ్యాంక్ తీసుకొచ్చింది. ‘ఐబాక్స్’ పేరుతో అందుబాటులోకి తెచ్చిన ఈ సదుపాయం ద్వారా వినియోగదారులు తమకు వచ్చిన క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, చెక్ బుక్, రిటర్న్ చెక్కులను తమ ఇళ్లు లేదా ఆఫీసుకు సమీపంలో ఉన్న శాఖకు వెళ్లి తీసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 17 నగరాల్లో 50కి పైగా శాఖల్లో ఈ సేవను ప్రారంభించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. వలపు ఉచ్చు.. సిబ్బంది వేతన ఖాతాల్లోకే ‘పాక్’ సొమ్ము
పాకిస్థాన్కు చెందిన ఐఎస్ఐ ప్రతినిధుల వలపు ఉచ్చులో చిక్కుకుని దేశ భద్రత రహస్యాలను వారికి చేరవేసిన భారత నౌకాదళ ఉద్యోగుల వేతన ఖాతాలు, వారి బంధువులు, సన్నిహితుల బ్యాంకు ఖాతాల్లో ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున నిధులు జమయ్యేవని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తేల్చింది. ముంబయికి చెందిన హవాలా ఆపరేటర్లు ఇంతియాజ్ సయ్యద్, షేక్ సహిస్థాలు (మహిళ) పాకిస్థాన్ హ్యాండ్లర్ల నుంచి వచ్చే ఆదేశాల మేరకు సంబంధిత నౌకాదళ ఉద్యోగుల ఖాతాల్లో ఈ సొమ్ములు వేసేవారని గుర్తించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. అమ్మో.. చైనాకా?
ప్రపంచ దేశాల్ని హడలెత్తిస్తున్న కరోనా వైరస్తో పర్యాటకుల్లో కంగారు మొదలైంది. ముఖ్యంగా ఈ ప్రభావం అధికంగా ఉన్న చైనాకు వెళ్లేందుకు వెనుకాడుతున్నారు. ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నవాళ్లు అమ్మో.. చైనాకు వద్దని ఆగిపోతుంటే, ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వాళ్లు టూర్ ఆపరేటర్లతో మాట్లాడి తమ ప్యాకేజిలను రద్దు చేసుకుంటున్నారు. చైనాకు రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా మార్పులు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆకాంక్షించారు. -
ఏపీలో పింఛన్ల పంపిణీ.. వాలంటీర్లకు కీలక ఆదేశాలు
ఏప్రిల్, మే నెల పింఛన్ల పంపిణీకి వాలంటీర్లు ఆథరైజేషన్ పత్రాలు తీసుకోవాలని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) సర్క్యులర్ జారీ చేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ప్రజలు ఉదాసీనంగా ఉన్నంత కాలం నిబంధనలు అమలు కావు: జస్టిస్ చలమేశ్వర్
ప్రజలు ఉదాసీనంగా ఉన్నంత కాలం ఎన్ని నిబంధనలు ఉన్నా అమలు కావని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. -
ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
నేడు నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ముంబయి-హైదరాబాద్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్చరణ్ దంపతులు
తిరుమల శ్రీవారిని సినీనటుడు రామ్చరణ్, ఉపాసన దంపతులు దర్శించుకున్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మావయ్యా.. ఇదేం ప్రగతయ్యా..?
నాడు-నేడు అంటూ విద్యా వ్యవస్థలో, మౌలిక సదుపాయాల కల్పనలో ఎన్నో సమూల మార్పులు తెచ్చామని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా.. నేటికీ పలు చోట్ల ఆ ప్రగతి కనిపించడం లేదు. -
డబ్బులు ఇస్తారా.. స్టేషన్కు వస్తారా..!
కొంతమంది పోలీసులు అధికారుల ఆదేశాలను అడ్డుగా పెట్టుకుని వసూళ్లకు పాల్పడుతున్నారు. తాము నిబంధనలు ఉల్లంఘించలేదని తమను వదిలిపెట్టాలని బాధితులు వేడుకుంటున్నా వారు వినిపించుకోకుండా తమదైన ముద్ర చూపుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.. -
ప్రయాణికుల రద్దీ.. 32 ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఆ రైళ్ల వివరాలివే..
తాజా వార్తలు (Latest News)
-
2030 నాటికి విమాన సర్వీసులు డబుల్..
-
ఉప్పల్లో సిక్సర్ల మోత.. ముంబయిని ఓడించి బోణీ కొట్టిన హైదరాబాద్
-
ఆరోగ్యకరమైన జీవితానికి మూడు సూత్రాలు.. డాక్టర్ ఫార్ములా షేర్ చేసిన హర్ష గోయెంకా
-
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
-
26/11 హీరో సదానంద్ వసంత్ దాటేకు ఎన్ఐఏ పగ్గాలు
-
కాంగ్రెస్ ఎనిమిదో జాబితా.. తెలంగాణలో మరో నాలుగు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన