ఏప్రిల్ నుంచి బీఎస్-6 ఇంధనం!
ఏప్రిల్ నెల ఒకటో తేదీ నుంచి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.0.50 నుంచి రూ.1 మేర పెరిగే అవకాశముంది. యూరో-6 ఉద్గార-అల్ట్రా క్లీన్-వాహన ఇంధనాలకు భారత్ మారుతుండడమే ఇందుకు కారణం. ప్రస్తుతం దేశంలో బీఎస్-4 ప్రమాణాల ఇంధనం
లీటర్కు రూ.0.50 నుంచి రూ.1 మేర ధరలు పెరిగే అవకాశం
దిల్లీ: ఏప్రిల్ నెల ఒకటో తేదీ నుంచి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.0.50 నుంచి రూ.1 మేర పెరిగే అవకాశముంది. యూరో-6 ఉద్గార-అల్ట్రా క్లీన్-వాహన ఇంధనాలకు భారత్ మారుతుండడమే ఇందుకు కారణం. ప్రస్తుతం దేశంలో బీఎస్-4 ప్రమాణాల ఇంధనం వాడుతున్నాం. ఇది యూరో-4 ప్రమాణాలకు సరిసమానం. మరోవైపు, దేశంలో వాహన కాలుష్యానికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఏప్రిల్-2020 నుంచి నేరుగా (బీఎస్-5ను తప్పించేసి) కొత్త ప్రమాణాలను అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం దిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.73.36, లీటర్ డీజిల్ రూ.66.36గా ఉంది. బీఎస్-6 ప్రమాణాలతో ఇంధనాన్ని ఉత్పత్తి చేసేలా రిఫైనరీలను మార్చేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ.17,000 కోట్ల పెట్టుబడి పెట్టగా, మొత్తం పరిశ్రమ రూ.30,000 కోట్లు వెచ్చించింది. తమ కంపెనీకి చెందిన అన్ని రిఫైనరీలు నూతన ప్రమాణాలతో కూడిన ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తున్నాయని, ఫిబ్రవరి నెల్లో దేశంలోని అన్ని డిపోలకు ఈ ఇంధనం సరఫరా అవుతుందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ఛైర్మన్ సంజయ్సింగ్ తెలిపారు. ‘‘ఏప్రిల్-1 గడువుకు మేం కట్టుబడి ఉన్నాం. ఆ రోజు నాటికి మొత్తం పెట్రోల్, డీజిల్ సరఫరా కొత్త ప్రమాణాలను చేరుకుంటుంది’’ అని వివరించారు. బీఎస్-4 ప్రమాణాల ఇంధనంతో పోల్చితే బీఎస్-6 ప్రమాణాల ఇంధనం ధరలు అధికంగా ఉన్నాయని, భారత్లోని ధరలు నేరుగా అంతర్జాతీయ ధరలతో ప్రభావితం అవుతున్నందున.. ఏప్రిల్ నుంచి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశముందని సంజయ్సింగ్ తెలిపారు. ఈ పెరుగుదల లీటర్కు రూ.0.50 నుంచి రూ.1 మధ్య ఉండే అవకాశముందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
రాష్ట్రంలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM