బాబూ మూర ఎంత?

ఆమె చేతి సంచీ పట్టుకుని సంతలో కలియతిరిగారు... ఆమెను గుర్తించిన కొందరు ఆశ్చర్యపోయారు. సామాన్యురాలి మాదిరిగా కూరగాయలు, పువ్వులు కొనడాన్ని ఆసక్తిగా చూశారు. ఇంతకూ ఆమె ఎవరంటారా... ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు సుధా నారాయణమూర్తి.

Updated : 03 Feb 2020 08:43 IST

సంతలో పువ్వులు, కూరగాయలు కొన్న సుధా నారాయణమూర్తి

ఆమె చేతి సంచీ పట్టుకుని సంతలో కలియతిరిగారు... ఆమెను గుర్తించిన కొందరు ఆశ్చర్యపోయారు. సామాన్యురాలి మాదిరిగా కూరగాయలు, పువ్వులు కొనడాన్ని ఆసక్తిగా చూశారు. ఇంతకూ ఆమె ఎవరంటారా... ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు సుధా నారాయణమూర్తి. తమ ఇలవేల్పు షోర్పాలిలోని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు ఆమె ఆదివారం కర్ణాటకలోని బాగల్‌కోట జిల్లా జమఖండి వచ్చారు. స్థానికంగా బంధువుల ఇంట్లో బసచేసి, ఏపీఎంసీ ప్రాంగణంలో వారపు సంతను సందర్శించారు. ఇటీవల కృష్ణానది వరదల్లో సర్వం కోల్పోయిన వ్యాపారులను పరామర్శించారు. సంతలో కొన్న కూరగాయలను తాను బెంగళూరు తీసుకెళ్తానని చెప్పారు.


   - న్యూస్‌టుడే, బాగల్‌కోట
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని