హైదరాబాద్కు ‘దిశ’ న్యాయవిచారణ కమిషన్
‘దిశ’ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్కు సంబంధించి సుప్రీంకోర్టు నియమించిన న్యాయవిచారణ కమిషన్ ఇవాళ దిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకుంది...
హైదరాబాద్: ‘దిశ’ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్కు సంబంధించి సుప్రీంకోర్టు నియమించిన న్యాయవిచారణ కమిషన్ ఇవాళ దిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకుంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సిర్పూర్కర్, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖా ప్రకాశ్, సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయ ఈ కమిషన్లో సభ్యులుగా ఉన్నారు. హైకోర్టు ప్రాంగణంలోనే న్యాయ కమిషన్ విచారణకు ఏర్పాట్లు చేశారు.
దిశ నిందితుల ఎన్కౌంటర్పై అనుమానాలు వ్యక్తంచేస్తూ కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో.. న్యాయవిచారణ కమిషన్ను ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిషన్ విచారణ ప్రారంభించిన ఆరు నెలల్లోపు నివేదిక సమర్పించాల్సి ఉంది. విచారణలో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్ ఉన్నతాధికారులతో పాటు ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులు, దర్యాప్తు అధికారులు, ఎన్కౌంటర్ అనంతరం పంచనామాలో భాగస్వాములైన రెవెన్యూ అధికారులు, పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులను న్యాయ విచారణ కమిషన్ ప్రశ్నించనుంది. ఎన్కౌంటర్లో మృతి చెందిన నిందితుల కుటుంబ సభ్యులను కూడా కమిషన్ విచారించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్