జీఏడీ అధికారి నివాసంలో ఐటీ సోదాలు
ఏపీ సచివాలయం సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ)లో స్టాటిస్టికల్ అధికారిగా పనిచేస్తోన్న పెండ్యాల శ్రీనివాస్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు...
విజయవాడ: ఏపీ సచివాలయం సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ)లో స్టాటిస్టికల్ అధికారిగా పనిచేస్తోన్న పెండ్యాల శ్రీనివాస్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ సిద్దార్ధనగర్లోని కంచుకోట అపార్ట్మెంట్లో ఇవాళ ఉదయం నుంచి తనిఖీలు చేపట్టారు. ప్రత్యేక బృందాలు అత్యంత రహస్యంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నాయి. సంబంధిత దృశ్యాలను చిత్రీకరిస్తు్న్న మీడియాను.. బందోబస్తు విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర భద్రతా సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద శ్రీనివాస్ వ్యక్తగత కార్యదర్శిగా చాలా ఏళ్లు పని చేశారు. ప్రభుత్వం మారడంతో ఎన్నికల అనంతరం తిరిగి తన మాతృ సంస్థకు వెళ్లి విధులు నిర్వహిస్తున్నారు. తొలుత శ్రీనివాస్ నివాసంలో అనిశా సోదాలు జరుపుతున్నట్లు ప్రచారం జరిగినా ఆ శాఖ అధికారులు తోసిపుచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.