వీడియో: దూడ కోసం 5 కి.మీ..!

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మంగాపురంలో ఓ ఆవు తల్లి ప్రేమను చాటుకుంది.

Published : 07 Feb 2020 22:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మంగాపురంలో ఓ ఆవు తల్లి ప్రేమను చాటుకుంది. మహమ్మద్‌ పాషా అనే రైతు తన వద్ద ఉన్న నాలుగు ఆవులను అమ్ముదామని నర్సాపూర్‌ సంతకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. వాహనంలో మూడు ఆవులను ఎక్కించగా ఓ ఆవు మాత్రం మొరాయించి వాహనంలో ఎక్కలేదు. దీంతో ఆ ఆవు దూడను తీసుకెళ్తే ఆవు కూడా వస్తుందని ఆలోచించాడు. మిత్రుడి సాయంతో దూడను తీసుకొని ద్విచక్ర వాహనంపై బయలు దేరగా తన బిడ్డను ఎత్తుకెళ్తున్నారని భావించిన ఆవు మనసు తల్లడిల్లిపోయింది. దాదాపు అయిదు కిలోమీటర్ల మేర దూరం పరుగెత్తింది. ఆ దృశ్యాన్ని చూసి ప్రజలు తల్లి ప్రేమ ఎంత గొప్పదో అని మురిసిపోయారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని