మేడారం జాతర నిర్వహణపై కేసీఆర్‌ సంతృప్తి

మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర నిర్వహణపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. జాతర ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌...

Published : 08 Feb 2020 22:14 IST

హైదరాబాద్‌: మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర నిర్వహణపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. జాతర ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డిని సీఎం కేసీఆర్ అభినందించారు. జాతర నిర్వహణలో సహాయ సహకారాలు అందించిన అన్ని శాఖల ఉద్యోగులు, పోలీసులు, అధికారులను కేసీఆర్‌ అభినందించారు. అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించి దిగ్విజయంగా జాతరను నిర్వహించారని కేసీఆర్‌ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా అధికారులు చేశారని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని