భారత్కు కరోనా ముప్పు ఎక్కువే
చైనాను వణికిస్తున్న ప్రాణాంతక కొత్త తరహా కరోనా వైరస్ భారత్కు వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువేనని తాజా అధ్యయనమొకటి వెల్లడించింది. ఈ వైరస్ ముప్పు అధికంగా పొంచి ఉన్న 20 దేశాల జాబితాలో భారత్ ఉందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందే అవకాశాలపై జర్మనీకి చెందిన హంబోల్ట్ విశ్వవిద్యాలయం, రాబర్ట్ కోచ్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్న దేశాల జాబితాలో 17వ స్థానం
దిల్లీ: చైనాను వణికిస్తున్న ప్రాణాంతక కొత్త తరహా కరోనా వైరస్ భారత్కు వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువేనని తాజా అధ్యయనమొకటి వెల్లడించింది. ఈ వైరస్ ముప్పు అధికంగా పొంచి ఉన్న 20 దేశాల జాబితాలో భారత్ ఉందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందే అవకాశాలపై జర్మనీకి చెందిన హంబోల్ట్ విశ్వవిద్యాలయం, రాబర్ట్ కోచ్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. చైనా నుంచి సగటున ఎంతమంది ఏయే దేశాలకు వెళ్తుంటారనే గణాంకాలను సేకరించారు. ‘‘చైనాలోని హాంగ్ఝౌ విమానాశ్రయం నుంచి రాకపోకలను ఉదాహరణగా తీసుకుందాం. అక్కడి నుంచి వెయ్యి మంది ప్రయాణికులు బయలుదేరితే.. అందులో సగటున ఇద్దరు జర్మనీకి వెళ్లే అవకాశముంది. అంటే కరోనా వైరస్ జర్మనీకి వ్యాప్తి చెందే ముప్పు 0.2%గా ఉన్నట్లు నిర్ధారించాం’’ అని పరిశోధకులు వివరించారు. ఈ లెక్కన దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 0.066%, ముంబయిలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయానికి 0.034%, కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయానికి 0.024% ముప్పు ఉందని తెలిపారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోచి విమానాశ్రయాలకు కొంత ముప్పు పొంచి ఉందన్నారు. మొత్తంగా చూస్తే కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 17వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. థాయిలాండ్, జపాన్, దక్షిణ కొరియా ఈ జాబితాలో వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM