ప్లాస్టిక్ తీసుకురండి.. స్నాక్స్ పట్టుకెళ్లండి
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ప్లా్స్టిక్ ఒకటి. ఆ వ్యర్థాల వల్ల అటు భూమి కలుషితమవ్వడమే కాక.. ఇటు జంతువులు కూడా వాటిని తిని చనిపోతున్నాయి. ప్లాస్టిక్ సమస్యను అధిగమించడంలో రీసైక్లింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, దీనిపై అవగాహన అంతంత మాత్రమే.
అహ్మదాబాద్: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ప్లాస్టిక్ ఒకటి. ఆ వ్యర్థాల వల్ల అటు భూమి కలుషితమవ్వడమే కాక.. ఇటు జంతువులు కూడా వాటిని తిని చనిపోతున్నాయి. ప్లాస్టిక్ సమస్యను అధిగమించడంలో రీసైక్లింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, దీనిపై అవగాహన అంతంత మాత్రమే. దీంతో రీసైక్లింగ్పై అవగాహన పెంచేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గుజరాత్లోని దాహోడ్ జిల్లా పంచాయత్ అధికారులు. చెత్తను సేకరించేందుకు ‘ప్లాస్టిక్ కేఫ్’ను ప్రారంభించారు. ఇక్కడ స్నాక్స్ తినాలంటే ఓ కిలో చెత్త.. టీ తాగాలంటే ఓ అర కిలో చెత్త తీసుకురావాల్సి ఉంటుంది.
రాష్ర్టంలోనే తొలి సారిగా స్వచ్ఛభారత్ అభియాన్లో భాగంగా దీన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. జిల్లా మొత్తాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చాలన్న ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కిలో ప్లాస్టిక్ తీసుకొస్తే స్నాక్స్... అరకిలో తీసుకొస్తే.. టీ ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. ప్లాస్టిక్ను అనవసరంగా బయట పడేస్తుండటం గమనించి.. అందుకు పరిష్కారంగా ఈ కెఫేను ప్రారంభించామన్నారు. ఇలా సేకరించిన ప్లాస్టిక్ను రీసైకిల్ చేస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటివి మరిన్ని నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ‘సఖీ మండల్’ పథకం కింద మహిళలు తయారు చేసిన స్నాక్స్ను కెఫేలో అందిస్తున్నామని తెలిపారు. దీనివల్ల మహిళలకూ ఉపాధి లభిస్తోందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు