హైదరాబాద్‌ మెట్రోలో రికార్డుస్థాయి ప్రయాణికులు..

మెట్రోలో రికార్డు స్థాయిలో ప్రయాణికులు ప్రయాణించినట్లు హైదరాబాద్‌ మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి తెలిపారు. నిన్న ఒక్కరోజే 3 కారిడార్లలో 4.47...

Updated : 11 Feb 2020 20:25 IST

హైదరాబాద్‌: మెట్రో రైలులో సోమవారం రికార్డు స్థాయిలో ప్రయాణికులు ప్రయాణించినట్లు హైదరాబాద్‌ మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. సోమవారం ఒక్కరోజే 3 కారిడార్లలో 4.47 లక్షల మంది ప్రయాణించినట్లు చెప్పారు. జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ కారిడార్‌లో 34 వేల మంది ప్రయాణించారన్నారు. ఈ కారిడార్‌లో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. క్యూఆర్ కోడ్ టికెట్ విధానంతో ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందని ఎన్వీఎస్‌ రెడ్డి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని