మాయావతి ఇంటికి పవర్ కట్
బహుజన్ జమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతికి ఈ ఉదయాన్నే ‘కరెంట్ షాక్’ తగిలింది.
లఖ్నవూ (యూపీ): బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతికి విద్యుత్ అధికారులు షాకిచ్చారు. సకాలంలో విద్యుత్ బిల్లు చెల్లించనందుకు గ్రేటర్ నొయిడాలో ఉన్న ఈ మాజీ ముఖ్యమంత్రి నివాసానికి బుధవారం ఉదయం విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సుమారు రూ.67 వేలు విద్యుత్ బిల్లు బకాయి ఉన్నారని విద్యుత్ శాఖ అధికారి ఒకరు తెలిపారు. దీంతో మాయావతి కుటుంబ సభ్యులు వెంటనే రూ.50వేలు బిల్లు చెల్లించిన అనంతరం ఆమె ఇంటికి కరెంటు సరఫరాను పునరుద్ధరించారు. ఇందులో రాజకీయ ఉద్దేశాలేమీ లేవని, కరెంటు బిల్లు చెల్లించని వారికి సరఫరా నిలిపివేయటం మామూలేనని లఖ్నవూలోని విద్యుత్ శాఖ ఉన్నతాధికారి ఒకరు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని