నిరుద్యోగ యువతకు ఎన్టీపీసీ తోడ్పాటు
ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగ యువతకు ఎన్టీపీసీ బాసటగా నిలుస్తోంది. యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ఉచితంగా లైట్ మోటారు వాహన డ్రైవింగ్లో శిక్షణ అందిస్తోంది.
విశాఖపట్నం: ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగ యువతకు ఎన్టీపీసీ బాసటగా నిలుస్తోంది. యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ఉచితంగా లైట్ మోటారు వాహన డ్రైవింగ్లో శిక్షణ అందిస్తోంది. దీని కోసం గాజువాక ప్రభుత్వ ఐటీఐతో ఒప్పందం చేసుకుంది. ప్రమాదాలు నివారించేలా భారీ వాహనాల డ్రైవింగ్లోనూ యువకులు శిక్షణ పొందుతున్నారు.
తక్కువ విద్యార్హతతో ప్రభుత్వ ప్రైవేటు రంగంలో ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడాలనుకునే వారి కోసం ప్రభుత్వం ఐటీఐలు ఏర్పాటు చేసింది. ఆ ఆలోచనను నిజం చేసేలా విశాఖలోని గాజువాక ఐటీఐ గ్రామీణ నిరుద్యోగ యువతకు భారీ వాహనాల డ్రైవింగ్లో శిక్షణను ఇస్తోంది. 45 రోజులపాటు సాగే ఈ కోర్సులో బ్యాచ్కు 20 మంది చొప్పున విద్యార్థులను ఎంపిక చేస్తారు. మొదటి 15 రోజులు శిక్షణ తరగతుల్లో ట్రాఫిక్ నిబంధనలు, బ్యాటరీ, ఆయిల్ లెవల్, కూలెంట్ తనిఖీ, పంక్చర్ అయితే టైర్లు మార్చడం వంటి అంశాలను నేర్పిస్తారు. మిగిలిన రోజులు నిపుణుల బృందం సమక్షంలో ప్రతి విద్యార్థి అయిదు కిలోమీటర్ల చొప్పున డ్రైవింగ్లో నైపుణ్యం సాధిస్తారు. లైట్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు మాత్రమే ఈ శిక్షణకు అర్హులు. ప్రమాదాలు జరగకుండా శాస్త్రీయ పద్దతిలో శిక్షణ ఇవ్వడం ఈ సంస్థ ప్రత్యేకత. ఈ కోర్సు ద్వారా ఉద్యోగంలో స్థిరపడగలుగుతామని, లేదంటే స్వయం ఉపాధి అయినా పొందగలమని విద్యార్థులు తెలిపారు.
కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని సింహాద్రి ఎన్టీపీసీ నిర్ణయించింది. ఏడాది క్రితం గాజువాక ఐటీఐతో ఒప్పందం చేసుకొని విద్యార్థులకు శిక్షణనిస్తోంది. ప్రతి బ్యాచ్కు 20 మంది చొప్పున ఇప్పటికే 60 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. శిక్షణ పొందేవారికి రెండు నెలల ఉచిత బస్పాస్, ఖాకీ చొక్కా, ధ్రువపత్రం అందజేస్తారు. శిక్షణ ప్రారంభానికి ముందు ఎల్ఎల్ఆర్, ముగిసిన తర్వాత పూర్తి డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. డ్రైవింగ్తో పాటు వాహన నిర్వహణ కూడా నేర్పుతామని శిక్షకులు తెలిపారు. భవిష్యత్తులో మరింత మంది గ్రామీణ నిరుద్యోగ యువతకు డ్రైవింగ్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని ఎన్టీపీసీ అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు