కరీంనగర్కు చేరుకున్న సీఎం కేసీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం రాత్రి కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లికి చేరుకున్నారు. రాత్రికి తీగలగుట్టపల్లిలోనే సీఎం బస చేయనున్నారు. గురువారం ఉదయం బయలుదేరి కాళేశ్వరం చేరుకొని ముక్తేశ్వరస్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం
కరీంనగర్: కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం రాత్రి కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లికి చేరుకున్నారు. రాత్రికి తీగలగుట్టపల్లిలోనే సీఎం బస చేయనున్నారు. గురువారం ఉదయం బయలుదేరి కాళేశ్వరం చేరుకొని ముక్తేశ్వరస్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజీని పరిశీలించనున్నారు. పర్యటనలో భాగంగా సీఎం నదీ జలాల నిల్వ తీరు, బ్యారేజీకి సంబంధించిన విషయాలు, ఇతరత్రా అంశాలపై అక్కడే ఇంజినీర్లు, అధికారులతో సమీక్షించనున్నారు. అనంతరం గోదావరి నదితో పాటు పరిసర ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా పరిశీలిస్తారు. లక్ష్మీ ఆనకట్టతో పాటు సరస్వతీ, పార్వతీ ఆనకట్టల నుంచి ఎల్లంపల్లి వరకు ఉన్న నీటి నిల్వలకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులతో కేసీఆర్ సమీక్షించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!