జగన్ షరతులను తిరస్కరిస్తున్నారు: సీబీఐ
అక్రమాస్తుల కేసుల్లో ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తే తన రాజకీయ, ధన, కండ బలంతో సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ పేర్కొంది. సీఎంగా పాలన విషయంలో ఆయనకు....
హైదరాబాద్: అక్రమాస్తుల కేసుల్లో ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తే తన రాజకీయ, ధన, కండ బలంతో సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ పేర్కొంది. సీఎంగా పాలన విషయంలో ఆయనకు బాధ్యత ఉందనడంలో సందేహం లేదని.. అయితే ఆ కారణంతో కోర్టుకు శాశ్వతంగా హాజరు కాలేనని చెప్పడం సరికాదని అభిప్రాయపడింది. సీబీఐ కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ జగన్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో సీబీఐ అధికారులు బుధవారం కౌంటర్ దాఖలు చేశారు. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్లో అనేక అంశాలను పొందుపరిచారు. తనపై తీవ్రమైన ఆరోపణలున్నాయని స్పష్టంగా తెలిసినప్పటికీ.. జగన్ బెయిల్ షరతులను తిరస్కరిస్తున్నారని సీబీఐ ఆక్షేపించింది. హాజరు మినహాయింపు పొంది బెయిల్ ఇచ్చిన కోర్టులో విచారణకు దూరం ఉండవచ్చా?అని కౌంటర్లో ప్రశ్నించింది. చిన్నపాటి కేసుల్లో హాజరు మినహాయింపు ఇవ్వొచ్చని.. తీవ్రమైన కేసుల్లో కాదంటూ గతంలో సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని కౌంటర్లో సీబీఐ ప్రస్తావించింది.
జగన్ది హైప్రొఫైల్ కేసు..
జగన్ సీఎం అయినంత మాత్రాన కేసు పరిస్థితుల్లో మార్పు వచ్చినట్లు కాదని.. కేసు నమోదైనప్పటి నుంచి ఆయన రాజకీయాల్లోనే ఉన్నారని సీబీఐ పేర్కొంది. వ్యక్తిగత హాజరు మినహాయింపు చాలా అరుదుగా ఇవ్వాలని.. ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పుడు మినహాయింపు ఇవ్వొద్దని హైకోర్టును కోరింది. అవసరమైనప్పుడు సీఆర్ పీసీ 317 ప్రకారం వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరే అవకాశం ఉందని తెలిపింది. జగన్ కేసు చాలా సున్నితమైన హైప్రొఫైల్ కేసుగా కౌంటర్ సీబీఐ అభివర్ణించింది. హాజరు మినహాయింపు నిందితుల హక్కు కాదని.. కోర్టు విచక్షణేనని స్పష్టం చేసింది. ప్రజా విధుల్లో ఉన్నంత మాత్రాన హాజరు మినహాయింపు కోరడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కి విరుద్ధమని సీబీఐ పేర్కొంది. చట్టం ముందు అందరూ సమానమేనని.. జగన్ అభ్యర్థన విచారణార్హం కాదని న్యాయస్థానానికి తెలిపింది. ఆయన అభ్యర్థనను కొట్టివేయాలని కోరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?