5 కేజీల మటన్ కొంటే హెల్మెట్ ఫ్రీ!
వినియోగదారుడి శ్రేయస్సే తనకు ముఖ్యమంటూ వినూత్న పద్ధతిలో ఓ మటన్ వ్యాపారి కొత్త తరహా వ్యాపారం మొదలుపెట్టాడు. రోడ్డు ప్రమాదాలు...
నందిగామ: వినియోగదారుడి శ్రేయస్సే తనకు ముఖ్యమంటూ వినూత్న పద్ధతిలో ఓ మటన్ వ్యాపారి కొత్త తరహా వ్యాపారం మొదలుపెట్టాడు. రోడ్డు ప్రమాదాలు జరిగినా తన వినియోగదారుల ప్రాణాలకు ఎలాంటి ఆపదా రాకూడదంటూ తనదైన శైలిలో వ్యాపారం చేస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లా నందిగామకు చెందిన వెంకటేశ్వరరావు అనే మటన్ వ్యాపారి తన వద్ద 5 కేజీల మటన్ కొనుగోలు చేస్తే ఒక హెల్మెట్ ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రచారం చేస్తున్నాడు. కేజీ మటన్ ధర రూ. 600 కాగా 5 కేజీలు కొన్నవారికి రూ. 600 విలువైన హెల్మెట్ను ఉచితంగా ఇస్తున్నాడు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తన వినియోగదారులకు ఏం కాకూడదనే ఇలాంటి ప్రయత్నం చేస్తున్నట్లు వెంకటేశ్వరరావు చెబుతున్నాడు. తద్వారా తన వ్యాపారం అభివృద్ధి చెందుతోందని అంటున్నాడు. అంతేకాకుండా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు కూడా తనవంతు కృషి చేస్తున్నాడు. తన వద్ద మటన్ కొనుగోలు చేసేందుకు వచ్చే వినియోగదారులు వారి ఇంటి నుంచే స్టీల్ బాక్స్లు తీసుకొచ్చినట్లయితే కేజీకి రూ.20 చొప్పున తగ్గిస్తానని చెబుతున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...