సి విటమిన్తో తగ్గనున్న వెంటిలేషన్ సమయం
తీవ్ర అనారోగ్యంతో ఐసీయూలో ఉండే రోగులకు సి విటమిన్ వల్ల ప్రయోజనం కలుగుతుందని తాజా పరిశోధనలో తేలింది. వీరు వెంటిలేషన్పై
వాషింగ్టన్: తీవ్ర అనారోగ్యంతో ఐసీయూలో ఉండే రోగులకు సి విటమిన్ వల్ల ప్రయోజనం కలుగుతుందని తాజా పరిశోధనలో తేలింది. వీరు వెంటిలేషన్పై ఉండాల్సిన సమయాన్ని ఇది తగ్గిస్తుందని వెల్లడైంది. సి విటమిన్ వల్ల అనేక బయోరసాయన ప్రయోజనాలు ఉంటాయి. నారెపైన్ఫ్రైన్, వాసోప్రెసిన్ విడుదలలో దోహదపడటం ద్వారా అది గుండె వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కార్నిటైన్ ఉత్పత్తికి సాయపడటం ద్వారా శక్తికి సంబంధించిన చ్కీజీజివక్రియను ప్రభావితం చేస్తుంది. సి విటమిన్ ద్వారా రక్తపోటు తగ్గుతున్నట్లు గతంలో నిర్వహించిన అధ్యయనంలో తేలింది. అలాగే గుండె ఎక్కువగా కొట్టుకునే సమస్యను, శ్వాసనాళాల్లో వ్యాకోచాన్ని తగ్గిస్తుందని వెల్లడైంది. తీవ్రస్థాయిలో అస్వస్థులుగా ఉన్నవారిలో విటమిన్ సి ప్లాస్మా స్థాయి తక్కువగా ఉంటుంది. ఆరోగ్యవంతులు రోజుకు 0.1 గ్రాముల మేర ఈ విటమిన్ను తీసుకోవడం ద్వారా సాధారణ ప్లాస్మా స్థాయిని పరిరక్షించుకోవచ్చు. తీవ్ర అనారోగ్యం ఉన్నవారికి ఇంకా ఎక్కువ మోతాదులో సి విటమిన్ను ఇవ్వాల్సి ఉంటుంది.
విటమిన్ సి తీసుకున్నవారిలో వెంటిలేషన్ సమయం సరాసరిన 14 శాతం మేర తగ్గుతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. అయితే అనారోగ్యం స్థాయిపై ఇది ఆధారపడి ఉంటుందని వివరించింది. 10 గంటల కన్నా ఎక్కువసేపు ఈ ప్రాణాధార వ్యవస్థపై ఉండేవారిలో ‘సి’ ఎలాంటి ప్రభావం కనిపించలేదు. 10 గంటల కన్నా ఎక్కువసేపు వెంటిలేషన్ అవసరమైన 471 మంది రోగులపై నిర్వహించిన ఐదు ప్రయోగాల్లో మాత్రం సి విటమిన్ ప్రభావం గణనీయంగా కనిపించింది. వీరికి రోజుకు 1-6 గ్రాముల మేర సదరు విటమిన్ను ఇవ్వడం వల్ల వీరికి ప్రాణాధార వ్యవస్థపై ఉండాల్సిన అవసరం సరాసరిన 25 శాతం తగ్గుతున్నట్లు నిర్ధరించారు. అయితే నిర్దిష్ట మోతాదును తేల్చడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత