కేసీపీ సంస్థల అధినేత లక్ష్మణదత్ ఇకలేరు
కేసీపీ సంస్థల అధినేత వెలగపూడి లక్ష్మణదత్ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 83 సంవత్సరాలు.
చెన్నై: ప్రముఖ వ్యాపారవేత్త, కేసీపీ సంస్థల అధినేత వెలగపూడి లక్ష్మణదత్ కన్నుమూశారు. చెన్నై ఎగ్మోర్లోని తన స్వగృహంలో గుండెపోటుతో మృతిచెందారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. లక్ష్మణదత్కు భార్య ఇందిరా దత్, కుమార్తె కవిత ఉన్నారు. డిసెంబర్ 27, 1937న జన్మించిన దత్.. మద్రాసు తెలుగు సమాఖ్య ఏర్పాటులో క్రియాశీల పాత్ర పోషించారు. రాష్ట్ర పారిశ్రామికీకరణలో కీలక పాత్ర పోషించారు. 1989లో ఆయనను యాజమాన్య రత్న పురస్కారంతో ప్రభుత్వం గౌరవించింది. 1991లో నాగార్జున యూనివర్సిటీ డాక్టర్ ఆఫ్ లెటర్స్ డిగ్రీని ప్రదానం చేసింది. ఆయన గతంలో ఫిక్కీ అధ్యక్షుడిగానూ సేవలందించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు, గుంటూరు జిల్లా మాచర్ల, చెన్నైలో కేసీపీ పరిశ్రమలను స్థాపించారు.
దత్ మృతి పారిశ్రామిక రంగానికి తీరని లోటు: ఉపరాష్ట్రపతి
వీఎల్ దత్ మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. మరణవార్త తెలిసిన అనంతరం ఆ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. దత్ మృతి భారత పారిశ్రామిక రంగానికి తీరని లోటన్నారు. గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్య రంగాల్లో వీఎల్ దత్ సేవలు మరవలేమన్నారు. అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడుల విదానంలో ఆయన నిష్ణాతుడని కొనియాడారు.
వీఎల్ దత్ మృతికి చంద్రబాబు సంతాపం
వీఎల్ దత్ మరణం పట్ల తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. పరిశ్రమల అభివృద్ధికి ఎనలేని సేవ చేశారని కొనియాడారు. పల్నాడు, ఉయ్యూరులో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు. సామాజిక సేవ, భాషాభివృద్ధికి దత్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.
మంచి మిత్రుడినికోల్పోయా: నామా
కేసీపీ సిమెంట్స్ అధినేత వీఎల్ దత్ మరణం పట్ల తెరాస లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మంచి మిత్రుడిని కోల్పోయానన్నారు. దత్ మంచి వ్యాపారవేత్త అనీ.. ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో ముందుండేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. బుధవారం చెన్నై వెళ్లి భౌతిక కాయానికి నివాళులర్పించి అంత్యక్రియల్లో పాల్గొంటానని నామా తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్