నాన్నా.. నిను మరవలేకున్నా..
ఇద్దరూ కుమార్తెలే. తల్లి పేగుతెంచుకుని, తండ్రి ప్రేమను పంచుకుని జన్మించిన వారే. ఓ కుమార్తె మాత్రం తండ్రి మరణాన్ని తట్టుకోలేకపోయింది. ‘‘నాన్న లేని ఈ జన్మ ఎందుకు’’ అనుకుంది. తండ్రికి ఏకంగా తన ప్రాణాన్నే నివాళిచ్చేందుకు ప్రయత్నించింది. మరో కుమార్తె మాత్రం అనుబంధాన్ని అపహాస్యం చేసింది. ఆస్తి పంచలేదన్న అక్కసుతో మరణించిన తల్లికి తన ఇంట్లో కాస్త చోటూ కల్పించడానికి నిరాకరించింది. రెండు రాష్ట్రాల్లో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనలివి.
తండ్రి మరణాన్ని తట్టుకోలేక గోదావరిలోకి దూకిన టీచరు
ఇద్దరూ కుమార్తెలే. తల్లి పేగుతెంచుకుని, తండ్రి ప్రేమను పంచుకుని జన్మించిన వారే. ఓ కుమార్తె మాత్రం తండ్రి మరణాన్ని తట్టుకోలేకపోయింది. ‘‘నాన్న లేని ఈ జన్మ ఎందుకు’’ అనుకుంది. తండ్రికి ఏకంగా తన ప్రాణాన్నే నివాళిచ్చేందుకు ప్రయత్నించింది. మరో కుమార్తె మాత్రం అనుబంధాన్ని అపహాస్యం చేసింది. ఆస్తి పంచలేదన్న అక్కసుతో మరణించిన తల్లికి తన ఇంట్లో కాస్త చోటూ కల్పించడానికి నిరాకరించింది. రెండు రాష్ట్రాల్లో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనలివి.
కోటపల్లి : తండ్రి మరణాన్ని తట్టుకోలేని ఓ యువతి.. ఆయన మృతదేహాన్ని తీసుకువస్తూ.. దారిలో గోదావరిలోకి దూకేసింది. ఆరవెల్లి సాయిప్రియ (32) మంచిర్యాల జిల్లా కోటపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఇంకా వివాహం కాలేదు. ఆమె తండ్రి వసంత్ సోమవారం మంచిర్యాల నుంచి చెన్నూరుకు వస్తుండగా జైపూర్ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. ఆయనకు ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం కాగా ఆడపిల్లల్లో సాయిప్రియ చివరి సంతానం. వసంత్ను కుటుంబ సభ్యులు కరీంనగర్కు తరలించి వైద్యచికిత్సలు అందిస్తుండగా మృతిచెందారు. తండ్రి మృతదేహాన్ని అంబులెన్సులో చెన్నూరుకు తీసుకొస్తుండగా వెనుక కారులో సాయిప్రియ తన అక్కాచెల్లెళ్లతో కలిసి వస్తున్నారు. దారిలో తండ్రిని తలచుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. కష్టపడి పెంచి ప్రయోజకురాలిని చేసిన నాన్న లేని జీవితం తనకెందుకు అనుకున్నారేమో.. కారు గోదావరి వంతెన మీదకు చేరుకోగానే.. వాంతి వస్తోందంటూ కారు ఆపారు. అందులోంచి దిగిన వెంటనే నదిలోకి దూకేశారు. కళ్లముందే జరిగిన ఈ అనూహ్య సంఘటనకు కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు. సాయంత్రం వరకు కూడా ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో వారంతా కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఆస్తి సంగతి తేలాకే...అమ్మ
- మృతదేహాన్ని ఇంట్లోకి తేకుండా తాళం వేసిన కుమార్తె
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: అమ్మా... చనిపోయిందా... అయితే ఏంటి... ముందు ఆస్తి సంగతి తేలాలి... ఆ తర్వాతే అంత్యక్రియలు... అని భీష్మించుకుని కూర్చుందా కుమార్తె. తల్లి మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకురాకుండా తలుపులు మూసి, తాళం వేసింది. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాలో సోమవారం జరిగింది. తారాచరణ సాహు, సూర్యమణి (82) భార్యాభర్తలు. వీరికి నలుగురు కుమార్తెలు, ఓ కుమారుడు. బ్రహ్మపురలోని శ్రీరామనగర్లో ఉంటున్నారు. తారాచరణ సైనికునిగా, పోలీసుశాఖలో ఎస్సైగా పనిచేశారు. వీరికి పలు గృహాలు, ఆస్తులు, కొంత భూమి ఉంది. 2001లో కుమారుడు చనిపోగా, 2008లో తారాచరణ మృతిచెందారు. నలుగురు కుమార్తెల మధ్య ఆస్తి గొడవలు తలెత్తాయి. తల్లిని పెద్ద కుమార్తె చూసుకునేది. ఆమెకు వస్తున్న పింఛను తనే తీసుకునేది. ఇటీవల అనారోగ్యానికి గురైన సూర్యమణిని పెద్దకుమార్తె పట్టించుకోలేదు. మిగిలిన కుమార్తెలు ఆమెను ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం చనిపోయారు. మృతదేహాన్ని శ్రీరామనగర్లోని ఇంటికి తీసుకురాగా... లోపలికి వెళ్లకుండా పెద్దకుమార్తె తాళం వేసింది. ఆస్తి సంగతి తేల్చాలని పట్టుబట్టింది. నాలుగు గంటలకుపైగా మృతదేహాన్ని బయటే ఉంచారు. పోలీసుల జోక్యం చేసుకుని, తాళాలు తెరిచి మృతదేహాన్ని లోపలికి తీసుకెళ్లి, కాసేపు ఉంచి అంత్యక్రియలకు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత