తెలంగాణ పీజీ ఈసెట్‌ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో ఎంటెక్‌, ఎంఫార్మా ప్రవేశాల కోసం నిర్వహించే పీజీ ఈసెట్‌ షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 3న పీటీ ఈసెట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Updated : 19 Feb 2020 21:43 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఎంటెక్‌, ఎంఫార్మా ప్రవేశాల కోసం నిర్వహించే పీజీ ఈసెట్‌ షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 3న పీటీ ఈసెట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. మార్చి 12 నుంచి ఏప్రిల్‌ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆలస్య రుసుముతో మే 26 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. మే 20 నుంచి మే 27 వరకు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. మే 28 నుంచి మే 31 వరకు పీజీ ఈసెట్‌ పరీక్షలు జరుగుతాయి. జూన్‌ 15న ఫలితాలు వెల్లడిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని