భయపడితే విజయం సాధించలేరు: శైలజాకిరణ్
వృత్తిలో విలువలు ఉన్నప్పుడే వ్యాపారం అభివృద్ధి చెందుతుందని మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ అన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న మహిళా సాధికారత సదస్సులో ఆమె ప్రసంగించారు.
హైదరాబాద్: వృత్తిలో విలువలు ఉన్నప్పుడే వ్యాపారం అభివృద్ధి చెందుతుందని మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ అన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న మహిళా సాధికారత సదస్సులో ఆమె ప్రసంగించారు. వ్యాపారం అభివృద్ధి చెందిందా లేదా అని కాకుండా వ్యాపారం ద్వారా సమాజానికి ఎంత మంచి జరిగిందో అందరూ ఆలోచించాలని సూచించారు. రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యత తక్కువగా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరికీ ఒక లక్ష్యం ఉండాలని.. అది మన వ్యక్తిత్వాన్ని వివరించేలా ఉండాలన్నారు. విజయాల్లో భాగస్వాములకు కూడా తగిన గుర్తింపు ఇవ్వాలని సూచించారు.
పెద్ద లక్ష్యాలు నిర్దేశించుకొని వాటిని సాధించేందుకు కృషి చేయాలని శైలజా కిరణ్ సూచించారు. వ్యాపారంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. కొన్ని సందర్భాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆ తప్పులను రెండో సారి చేయకూడదని చెప్పారు. వ్యాపారులు ఏం చేయగలరో అదే చెప్పాలని.. అదే చేయాలని సూచించారు. వినియోగదారుడి అవసరాలకు అనుగుణంగా సేవలు అందించాలన్నారు. వ్యాపారులు దృఢమైన, అత్యంత క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని.. అలాంటి సమయాల్లో భయపడేవారు ఎప్పటికీ విజయం సాధించలేరన్నారు. రేపటి గురించి భయపడకుండా ప్రస్తుతాన్ని ఆస్వాదించాలని ఆమె సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు