వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు

శివరాత్రి పండుగను పురస్కరించుకొని తెలంగాణ పర్యాటక శాఖ హైదరాబాద్ నుంచి వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధానానికి హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Updated : 20 Feb 2020 17:10 IST

ప్రారంభించిన పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌: శివరాత్రి పండుగను పురస్కరించుకొని తెలంగాణ పర్యాటక శాఖ హైదరాబాద్ నుంచి వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధానానికి హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏవియేషన్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో అందిస్తోన్న ఈ సేవలను పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బేగంపేట విమానాశ్రయంలో ప్రారంభించారు. నేటి నుంచి 23వ తేదీ వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. 
హైదరాబాద్ నుంచి వేములవాడ, తిరుగు ప్రయాణానికి కలిపి టికెట్ ధర రూ.30 వేలుగా నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. వేములవాడ నుంచి వ్యూ పాయింట్ టికెట్‌ ధర రూ. 3 వేలు, వేములవాడ, మిడ్ మానేరు జలాశయం, పరిసర ప్రాంతాల పర్యటన టిక్కెట్‌ ధర రూ.5,500గా ఉందని శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు.

పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వేములవాడ-హైదరాబాద్ మధ్య బస్సులు కూడా నడుపుతున్నట్లు మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు, పర్యాటక ప్రాంతాలకు హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. మేడారం జాతర సందర్భంగా హెలికాప్టర్ సేవలను వేయి మంది ఉపయోగించుకున్నట్లు వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని