అమరావతి పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళన

గుంటూరు జిల్లా లేమల్లెలో వైకాపా ఎంపీ నందిగం సురేశ్‌ను అడ్డుకున్న మహిళా ఐకాస నేతలు, రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని అమరావతి పీఎస్‌కు తరలిస్తున్నట్లు చెప్పి పెదకూరపాడు పీఎస్‌కు తీసుకెళ్లడంతో అక్కడ మహిళలు ఆందోళనకు దిగారు.

Published : 23 Feb 2020 23:37 IST


అమరావతి: గుంటూరు జిల్లా లేమల్లెలో వైకాపా ఎంపీ నందిగం సురేశ్‌ను అడ్డుకున్న మహిళా ఐకాస నేతలు, రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని అమరావతి పీఎస్‌కు తరలిస్తున్నట్లు చెప్పి పెదకూరపాడు పీఎస్‌కు తీసుకెళ్లడంతో అక్కడ మహిళలు ఆందోళనకు దిగారు. అనంతరం మళ్లీ అమరావతి పీఎస్‌కు తరలించడంతో అక్కడా ఆందోళన కొనసాగించారు. పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆందోళనకారులు ఆరోపించారు. అమరావతి పీఎస్‌ వద్ద ‘జై అమరావతి’ నినాదాలతో హోరెత్తించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని