అమరావతిలో రైతుల దీక్షలు..వైకాపా ర్యాలీ
రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళనలు 73వ రోజుకు చేరాయి. తాళ్లాయపాలెం, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతలు దీక్షలు కొనసాగుతున్నాయి.మరో వైపు బాపట్ల ఎంపీ నందిగం సురేష్పై కొన్నిరోజులక్రితం దాడి జరిగిందంటూ వైకాపా ర్యాలీ చేయడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది.
అమరావతి: రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళనలు 73వ రోజుకు చేరాయి. తాళ్లాయపాలెం, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతలు దీక్షలు కొనసాగుతున్నాయి.మరో వైపు బాపట్ల ఎంపీ నందిగం సురేష్పై కొన్నిరోజులక్రితం దాడి జరిగిందంటూ వైకాపా ర్యాలీ చేయడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది.
రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి మద్దతుగా ర్యాలీలో నినాదాలు చేశారు. తాళ్లాయపాలెం, మందడం, వెలగపూడి గ్రామాల మీదుగా ..రైతుల దీక్షా ప్రాంగణాల ముందు నుంచి వైకాపా శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. రైతుల దీక్షా శిబిరాల వద్దకు రాగానే ‘జై జగన్’ అంటూ వైకాపా కార్యకర్తలు నినాదాలు చేయగా.. అందుకు ప్రతిగా రైతులు, మహిళలు ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేశారు. పోటా పోటీ నినాదాలతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. వైకాపా ర్యాలీ దృష్ట్యా మందడం, వెలగపూడిలో పోలీసులు భారీగా మోహరించారు. న్యాయం చేయాలని కోరుతూ 73 రోజులుగా దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా ...వైకాపా శ్రేణులతో ర్యాలీనిర్వహించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను రెచ్చగొట్టే విధంగా ర్యాలీ నిర్వహించిన నేతలపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు.
రైతు కూలీ మృతి..
రాజధాని ప్రాంతంలో రైతు కూలీ కోటయ్య గుండెపోటుతో మృతి చెందారు. మందడం గ్రామానికి చెందిన కోటయ్య... గత కొన్ని రోజులుగా అమరావతికి మద్దతుగా ఆందోళనల్లో పాల్గొంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కోటయ్య మృతదేహానికి అమరావతి ఐకాస నాయకులు, రైతులు నివాళులర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్గా పీహెచ్డీ రామక్రిష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM