చిరంజీవి ఇంటిముట్టడిపై స్పందించిన ఐకాస

ప్రముఖ సినీనటుడు చిరంజీవి ఇంటిని ముట్టడించనున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి పేరిట తప్పుడు ప్రచారం జరుగుతోందని అమరావతి ఐకాస కన్వీనర్‌ గద్దె తిరుపతి రావు స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో....

Published : 28 Feb 2020 17:47 IST

అమరావతి: ప్రముఖ సినీనటుడు చిరంజీవి ఇంటిని ముట్టడించనున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి పేరిట తప్పుడు ప్రచారం జరుగుతోందని అమరావతి ఐకాస కన్వీనర్‌ గద్దె తిరుపతి రావు స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ఆ ప్రచారంతో తమకు సంబంధం లేదని.. ఆ ప్రచారాలను నమ్మొద్దని చెప్పారు. చిరంజీవి ఇంటిని ముట్టడించాలంటూ తాము ఎలాంటి పిలుపు ఇవ్వలేదన్నారు. తమ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కొంతమంది కావాలనే కుట్రలు చేస్తున్నారని తిరుపతిరావు ఆరోపించారు. అమరావతిని రాజధానిగా కొనసాగించేందుకే ఐకాస కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని