కూలిన పెళ్లి మండపం..ఎమ్మెల్యేకు గాయాలు

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో శుక్రవారం రాత్రి పెళ్లి మండపం కూలి మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో సహా ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఉండవల్లిలోని దేవుడు మాన్యంలో ఏర్పాటు చేసిన మండపం ఉన్నట్లుండి కూలిపోయింది.

Published : 29 Feb 2020 08:17 IST

ఉండవల్లి (తాడేపల్లి): గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో శుక్రవారం రాత్రి పెళ్లి మండపం కూలి మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో సహా ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఉండవల్లిలోని దేవుడు మాన్యంలో ఏర్పాటు చేసిన మండపం ఉన్నట్లుండి కూలిపోయింది. అదే సమయంలో వధూవరులను ఆశీర్వదించేందుకు వేదికపైకి వచ్చిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సహా పెళ్లి కుమారుడి బంధువులు కల్పన, సామ్రాజ్యం, శరణ్య, పెళ్లి కుమారుడు తండ్రి గణపతిరెడ్డి, వైకాపా నాయకులు దంటు బాలాజీరెడ్డి గాయపడ్డారు. శరణ్యను విజయవాడలోని ప్రైవేటు వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించగా మిగిలిన వారికి స్థానికంగా వైద్యం చేయించారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కుడికాలి పాదానికి గాయం కావడంతో ఆయన్ను గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయనకు పిండికట్టు వేశారు. ఇలా ఉండగా వివాహానికి ఎలాంటి ఆటంకం లేకుండా పక్కనే ఏర్పాట్లు చేసి పెళ్లి జరిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని