ఆ ఆలయాల్లోఆడవారిదే పైచేయి!

అవన్నీ దేవాలయాలు. అక్కడ మహిళలకు మాత్రమే ప్రవేశం అట. ఆ వివరాలేంటో చూద్దామా...

Published : 29 Feb 2020 15:48 IST

అవన్నీ దేవాలయాలు. అక్కడ మహిళలకు మాత్రమే ప్రవేశం అట. ఆ వివరాలేంటో చూద్దామా...

అత్తుకల్‌ దేవి దేవాలయం:  తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి దేవాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉందీ ఆలయం. పార్వతి దేవి మరో అవతారంగా చెప్పుకునే కన్నకీ మాతను కొలుస్తారిక్కడ. పైగా మహిళలకే ప్రవేశం. ఫిబ్రవరి, జనవరిలో జరిగే పొంగల్‌ పండగకు లక్షలమంది హాజరవుతారు. పెద్ద ఎత్తున మహిళలు ఒకే చోట చేరి అలా చేయడంతో ఈ దేవాలయం గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో చోటు సంపాదించుకుంది.

కుమారీ అమ్మన్‌ దేవాలయం: కన్యాకుమారిలో ఉన్న దేవాలయంలో మా భగవతీ దుర్గగా అమ్మవారిని కొలుస్తారు. యాభై ఒక్క శక్తిపీఠాల్లో ఇదీ ఒకటిగా చెబుతారు. సతీదేవి ఖండిత భాగాల్లో ఆమె వెన్నెముక ఈ కొండపైనే పడింది. ఇక్కడా మహిళలకు మాత్రమే ప్రవేశం. అవివాహితులు, సన్యాసులకు గుడి ద్వారం వరకే ప్రవేశం.

కామాఖ్యా దేవి ఆలయం: అసోంలోని గువహటిలో కొలువై ఉంది కామాఖ్యా దేవి. నెలసరి సమయంలోనే స్త్రీలకు గుడిలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఇక్కడ అమ్మవారికి నెలసరి వస్తుందని నమ్మకం.  అక్కడ పూజారులూ స్త్రీలే. వీటితోపాటు కేరళలోని చక్కులాతుకవు దేవాలయం, బిహార్‌లోని ముజఫర్‌ నగర్‌లో ఉన్న మాతా దేవాలయంలోకి కూడా పురుషులకు అనుమతి లేకపోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని