తితిదే వార్షిక బడ్జెట్కు బోర్డు ఆమోదం
2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బడ్జెట్కు బోర్డు ఆమోదం తెలిపింది. రూ.3,309 కోట్ల అంచనాతో రూపొందించిన...
రూ. 3,309 కోట్ల అంచనాతో కేటాయింపులు
తిరుమల: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బడ్జెట్కు బోర్డు ఆమోదం తెలిపింది. రూ.3,309 కోట్ల అంచనాతో రూపొందించిన వార్షిక బడ్జెట్కు తితిదే పాలకమండలి ఆమోద ముద్ర వేసింది. అనంతరం బడ్జెట్కు సంబంధించిన వివరాలను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. బూందీపోటులో అగ్నిప్రమాదాల నివారణకు. 3.30 కోట్లు, బర్డ్ ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాల కల్పనకు రూ. 8.50 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. బర్డ్ ఆసుపత్రిలో కొత్త ఉద్యోగాల భర్తీకి పాలకమండలి అనుమతి ఇచ్చిందన్నారు.
చెన్నైలో పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి రూ. 3.92 కోట్లు కేటాయించినట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు. తితిదేలో ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ విభాగం ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు వివరించారు. తితిదే పరిధిలోని ఆలయాల్లో భద్రత కోసం 1300 సీసీ కెమెరాల కొనుగోలుకు బోర్డు ఆమోదించినట్లు తెలిపారు. అలిపిరి వద్ద ద్విచక్రవాహనాలకు రుసుం మినహాయింపు, తిరుమలకు వచ్చే అన్ని రకాల వాహనాల టోల్ ధరలపై సమీక్ష నిర్వహించాలని పాలక మండలి నిర్ణయించింది. జమ్ము, ముంబయి, వారణాసిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేసేందుకు కూడా అనుమతిచ్చినట్లు సుబ్బారెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.