దిల్లీ మెట్రోలో వివాదాస్పద నినాదాలు
దిల్లీలోనే అతి పెద్దదైన రాజీవ్చౌక్ మెట్రో స్టేషన్లో ఉదయం 10.25గంటల ప్రాంతంలో రైలు స్టేషన్ నుంచి బయలుదేరుతున్న క్రమంలో వివాదాస్పద నినాదాలు వినిపించాయి.
దిల్లీ: . దిల్లీ రాజీవ్చౌక్ మెట్రో స్టేషన్లో ‘దేశద్రోహులను కాల్చేయండి’ అంటూ కొంతమంది యువకులు నినాదాలు చేశారు. శనివారం ఉదయం 10.25గంటల ప్రాంతంలో రైలు స్టేషన్ నుంచి బయలుదేరుతున్న క్రమంలో ఈ నినాదాలు వినిపించాయి. ‘దేశ యువత సీఏఏకు మద్దతు ఇవ్వడంతో పాటు దేశాన్ని రక్షించేందుకు సిద్ధంగా ఉంది’ అనే అర్థం వచ్చేలా వారు నినాదాలు చేశారు. కొంతమంది ప్రయాణికులు తమ సెల్ఫోన్లలో వీడియోలు తీస్తూ కనిపించారు. ఆ వీడియో కాస్తా ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది.
అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్(సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) అధికారులు ఆ నినాదాలు చేసిన ఆరుగురు యువకులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వాళ్లను దిల్లీ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఇటీవల ఈశాన్య దిల్లీలో జిహాదీ టెర్రరిజానికి వ్యతిరేకంగా జంతర్మంతర్ వద్ద శాంతి ర్యాలీ నిర్వహించారు. భాజపా నేత కపిల్శర్మ కూడా ఇలాంటి నినాదాలే చేశారు. కోర్టు సైతం ఆయన వ్యాఖ్యలపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. గత వారం రోజుల్లోనే మరోసారి ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో అలజడి ఏర్పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్