అల్లర్ల కారకులను కఠినంగా శిక్షించాలి:అనురాగ్
దిల్లీ అల్లర్ల కారకులను కఠినంగా శిక్షించాలని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. దేశ రాజధాని దిల్లీలో జరిగిన అల్లర్లలో 40మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
చండీగఢ్: దిల్లీ అల్లర్ల కారకులను కఠినంగా శిక్షించాలని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ కోరారు. దేశ రాజధాని దిల్లీలో జరిగిన అల్లర్లలో 40మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆదివారం చండీగఢ్లో ఆదాయశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్రమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాజపా నేతల అభ్యంతర వ్యాఖ్యలపై స్పందించాలన్న ప్రశ్నపై ఆయన మాట్లాడుతూ.. ‘కొన్నిసార్లు సమాచార లోపం వల్ల మీడియా తప్పుడు వార్తలు ప్రజలకు చూపిస్తుందని అనుకుంటున్నా. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతాయి. అన్ని రకాల ప్రశ్నలకు అక్కడ ప్రభుత్వం సమాధానం చెబుతుంది. మీరు ఎలాంటి ప్రశ్నలు అడగాలనుకున్నా అక్కడ అడగవచ్చు’ అని ఆయన పేర్కొన్నారు. అనురాగ్ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ఓ విలేకరి ఆయనకు వినిపించగా.. ‘నేను చెప్పింది ఇది కాదు. మీడియా నిజాలను మాత్రమే ప్రజలకు చూపించాలి. అసంపూర్తి సమాచారం ప్రమాదకరం’ అని మీడియాను ఉద్దేశిస్తూ అన్నారు.
‘దిల్లీ అల్లర్ల కారకులను కఠినంగా శిక్షించాలి. విభిన్న రకాల విశ్వాసాలున్న ప్రజలు మనదేశంలో నివసిస్తూ దేశ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. అదే మనదేశ బలం. దాన్ని దెబ్బతీయాలని భావించే వాళ్లను శిక్షించాల్సిందే’ అని ఆయన స్పష్టం చేశారు. కాగా.. ఇటీవల జరిగిన దిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన న్యాయస్థానం ఆయనపై కేసు నమోదు చేయకపోవడంపై విచారం వ్యక్తం చేసింది. మరోవైపు ఎన్నికల కమిషన్ సైతం ఆయనపై నిషేధం విధించి ఎన్నికల ప్రచారానికి దూరం పెట్టిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!