పుల్వామాదాడి కేసు: తండ్రీ కూతుళ్ల ఆరెస్టు
దిల్లీ: గత ఏడాది సీఆర్పీఎఫ్ బలగాలే లక్ష్యంగా జరిగిన పుల్వామా బాంబుదాడిలో సంబంధమున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు జాతీయదర్యాప్తు సంస్థ
దిల్లీ: గత ఏడాది సీఆర్పీఎఫ్ బలగాలే లక్ష్యంగా జరిగిన పుల్వామా బాంబుదాడిలో సంబంధమున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు జాతీయదర్యాప్తు సంస్థ మంగళవారం తెలిపింది. పుల్వామా ప్రాంతంలో నివసించే షకీర్ మాగ్రెయ్ ప్రధాన నిందితుడైన అదిల్అహ్మద్దార్కు ఆవాసంతో పాటు దాడికి కావాల్సిన సామాగ్రిని, వాహనాలను సరఫరా చేసినట్టు దర్యాప్తులో తేలినట్టు ఎన్ఐఏ తెలిపింది. దాడికి కొన్నిరోజుల ముందే అహ్మద్దార్తో పాటు మరికొంతమంది జైషేమహ్మద్ ఉగ్రవాదసంస్థకు కొంతమందిని షకీర్ కలిసినట్టు తెలుస్తోంది. షకీర్కు పుల్వామా ప్రాంతంలో ఒక ఫర్నీచర్ దుకాణం ఉంది. పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాదసంస్థ జైషేమహ్మద్కు చెందిన మహ్మద్ ఉమర్ ఫరూఖ్ 2018లో అహ్మద్దార్ను షకీర్కు పరిచయం చేశాడు. అప్పటినుంచి షకీర్ వారికి సహాయం చేస్తూనేఉన్నాడు. ఈ క్రమంలోనే బాంబుదాడికి కావాల్సిన వస్తువులన్నీ ఒక ఆన్లైన్ సంస్థ ద్వారా సేకరించాడు. దర్యాప్తులో అనేకసార్లు జైషే నుంచి భారీమొత్తంలో నగదు, పేలుడు పదార్థాలు తీసుకుని తన ఇంటిలో భద్రపరిచినట్టు వెల్లడించాడు. షకీర్తో పాటు అతని కుమార్తెను కూడా గత శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారిస్తునట్టు ఎన్ఐఏ సంస్థ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.27 అధిక వసూలు.. ఉబర్ ఇండియాకు రూ.28,000 జరిమానా
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
-
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
-
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
-
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్