ఇరాక్‌లో కరోనాతో ఒకరు మృతి

ఇరాక్‌లో కరోనాతో ఒకరు మృతి చెందారు. డెబ్బయేళ్ల వ్యక్తి కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరగా వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆ రోగిని సులైమనియాలోని ఈశాన్య ప్రాంతంలో నిర్బంధించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ బుధవారం ప్రాణాలు విడిచారు.

Published : 04 Mar 2020 15:32 IST

బాగ్దాద్‌: ఇరాక్‌లో కరోనాతో ఒకరు మృతి చెందారు. డెబ్భయేళ్ల వ్యక్తి కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరగా అతనికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆ రోగిని సులైమనియాలోని ఈశాన్య ప్రాంతంలో నిర్బంధించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ బుధవారం ప్రాణాలు విడిచారు. దేశంలో ఇదే తొలి కరోనా మరణమని ఇరాక్‌ పభుత్వం ప్రకటించింది. కాగా.. ఇరాక్‌లో ఇప్పటి వరకు 32 కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే ఐదుగురు వ్యక్తులకు వ్యాధి నిర్దారణ అయినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. అందులో కొంతమంది ఇటీవల ఇరాన్‌ నుంచి వచ్చినట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని