ఎల్‌ఈపీఎల్‌లో ఐటీ సోదాలు

లింగమనేని ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎల్‌ఈపీఎల్‌) సంస్థకు సంబంధించిన కార్యాలయాల్లో ఆదాయపు పన్ను 

Updated : 05 Mar 2020 01:56 IST

ఈనాడు, అమరావతి: లింగమనేని ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎల్‌ఈపీఎల్‌) సంస్థకు సంబంధించిన కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖాధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. విజయవాడ రామచంద్రనగర్‌లోని ఆ సంస్థ కార్పొరేట్‌ భవనంలో ఉదయం నుంచి రాత్రి వరకూ సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీకి చెందిన ప్రత్యేక బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. కార్యాలయం లోపలికి ఎవర్నీ అనుమతించలేదు. సంస్థ కార్యాలయంలోని పలు రికార్డులు, దస్త్రాలు పరిశీలించినట్లు సమాచారం. కంప్యూటర్‌లల్లోని డేటాను విశ్లేషించినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని