మార్చి 20 మాకు మరో ఉదయం: నిర్భయ తల్లి
: నిర్భయ కేసులో నిందితులను మార్చి 20వ తేది ఉదయం ఉరి తీసేందుకు అంతా సిద్ధమౌతోంది.ఇప్పటికే వరుసగా నాలుగుసార్లు డెత్వారెంట్లు జారీ చేసిన దిల్లీ
దిల్లీ: నిర్భయ కేసులో నిందితులను మార్చి 20వ తేది ఉదయం ఉరి తీసేందుకు అంతా సిద్ధమౌతోంది.ఇప్పటికే వరుసగా నాలుగుసార్లు డెత్వారెంట్లు జారీ చేసిన దిల్లీ పటియాలా కోర్టు మరోసారి డెత్వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నిర్భయ తల్లి ఆశాదేవి స్పందిస్తూ మార్చి 20 ఉదయం తమ జీవితాలకు మరో కొత్త ఉదయం అవుతుందంటూ వ్యాఖ్యానించారు. ఈసారైనా ఖచ్చితంగా వారికి మరణశిక్ష అమలు చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. 2012లో జరిగిన ఘటనలో కోర్టు పలుమార్లు విచారణ జరిపి నలుగురు నిందితులకు మరణశిక్షను ఖరారు చేసింది. అయితే నిందితులు ఈ తీర్పుపై పిటిషన్లు వేస్తూ ఉరిశిక్షను తప్పించుకుంటున్నారు. ఆ నలుగురు నిందితులకు వేసే శిక్ష ద్వారా మరొకరు ఇలాంటి ఘాతకాలకు పాల్పడలంటే భయపడేలా ఉండాలని నిర్భయ చివరి కోరికగా ఆశాదేవి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్