ఆడపిల్లకు జన్మనిచ్చిన దిశ నిందితుడి భార్య

దిశ ఎన్‌కౌంటర్‌లో  మృతిచెందిన మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్ల గ్రామానికి చెందిన చెన్న కేశవులు భార్య రేణుక ఆడపిల్లకు జన్మనిచ్చింది. తొమ్మిది నెలలు నిండిన ఆమెకు నొప్పులు రావడంతో మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ

Published : 07 Mar 2020 09:51 IST

వీరన్నపేట (మహబూబ్‌నగర్)‌: దిశ ఎన్‌కౌంటర్‌లో  మృతిచెందిన మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్ల గ్రామానికి చెందిన చెన్న కేశవులు భార్య రేణుక ఆడపిల్లకు జన్మనిచ్చింది. తొమ్మిది నెలలు నిండిన ఆమెకు నొప్పులు రావడంతో మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో గురువారం చేర్పించారు. సాధారణ కాన్పు కోసం వైద్యులు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాకపోవడంతో స్త్రీ వైద్య నిపుణుల విభాగం అధిపతి డా.రాధ ఆధ్వర్యంలో శస్త్రచికిత్స చేశారు. రేణుక ఆడపిల్లకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దిశ ఎన్‌కౌంటర్‌ జరిగిన సమయంలో ఆమె ఆరునెలల గర్భవతిగా ఉన్నారు. పన్నేండళ్లకే వివాహం కాగా.. ఆమె పద్నాలుగేళ్లకు ఆడబిడ్డను జన్మనిచ్చింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని