సభ నుంచి కాంగ్రెస్‌ సభ్యుల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తున్న సమయంలో అడ్డుతగిలిన కాంగ్రెస్‌ సభ్యులను సస్పెండ్‌....

Updated : 07 Mar 2020 15:13 IST

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు రెండో రోజు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తున్న సమయంలో ఆయన ప్రసంగానికి అడ్డుతగిలిన ఆరుగురు కాంగ్రెస్‌ సభ్యులను సస్పెండ్‌ చేయాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సస్పె్న్షన్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో సభ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, డి.శ్రీధర్‌బాబు, సీతక్క, పొదెం వీరయ్య, జగ్గారెడ్డిని సభ నుంచి ఒకరోజు సస్పెండ్‌ చేస్తు్న్నట్టు సభాపతి ప్రకటించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని